నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపిన కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హత్య చేసిన తర్వాత నిందితుడు పారిపోయాడు. అయితే అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా…. ఆదివారం నిందితుడు రియాజ్ పట్టుబడ్డాడు. దీనిపై నిజామాబాద్ సిటీ సీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

“నిజామాబాద్ పట్టణంలో జరిగిన కానిస్టేబుల్ హత్యకేసులో నిందితుడు రియాజ్ ను అదుపులోకి తీసుకున్నాం. నిజామాబాద్ సారంగపూర్ ప్రాంతంలో ఒక వ్యక్తిని హత్య చేయటానికి ప్రయత్నిస్తుండగా పోలీసు బలగాలు త్వరితగతిన వెళ్లి పట్టుకున్నాయి” అని సీపీ కార్యాలయం ప్రకటించింది. దీంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది.
ఇక రియాజ్ ఎన్ కౌంటర్ అయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి. దీనిపై నగర సీపీ సాయి చైతన్య ప్రకటన చేశారు. అతనిపై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. ప్రాణాలతోనే అదుపులోకి తీసుకున్నామని క్లారిటీ ఇచ్చారు.
ఎలా పట్టుబడంటే..?
పోలీసులు రెండు రోజులుగా నిందితుడు రియాజ్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. 6వ ఠాణా పరిధిలోని సారంగాపూర్ శివారు ప్రాంతంలోని ఓ షెడ్డులో రియాజ్ తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల సమాచారాన్ని గమనించిన రియాజ్…. పారిపోయే ప్రయత్నం చేశాడు.దగ్గర్లోనే ఉన్న బైక్ మెకానిక్ ఆసిఫ్ అతడిని పట్టుకున్నాడు. దీంతో రియాజ్ కత్తితో ఆసిఫ్ను గాయపర్చాడు. వీరిద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు… నిందితుడిని పట్టుకున్నారు. ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కానిస్టేబుల్ హత్య - అసలేం జరిగిందంటే..?
ఈ సంఘటన అక్టోబర్ 17వ తేదీన రాత్రి 08.30 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగింది. వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాల కేసులో నిందితుడిగా ఉన్న షేక్ రియాద్(24) అనే క్రిమినల్ ను అరెస్ట్ చేసి బైక్ పై పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడి… కానిస్టేబుల్ ప్రమోద్(40)ను కత్తితో పొడిచి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితుడు రియాద్ పారిపోయాడు.
కానిస్టేబుల్ ప్రమోద్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ విభాగమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో పనిచేస్తున్నాడు. కానిస్టేబుల్ మృతి పట్ల డీజీపీ శివధర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
{{/usCountry}}కానిస్టేబుల్ ప్రమోద్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ విభాగమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో పనిచేస్తున్నాడు. కానిస్టేబుల్ మృతి పట్ల డీజీపీ శివధర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
{{/usCountry}}