ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం 700 ఎకరాలు సేకరణ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో భూ సేకరణ ప్రక్రియ మెుదలుకానుంది.

Published on: Nov 04, 2025 10:52 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. 700 ఎకరాల భూ సేకరణ కోసం ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణలో 6 ప్రాంతీయ ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎంపిక చేశారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయడం సాధ్యమేనని చెప్పింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నందున 700 ఎకరాలను సేకరించాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ప్రభుత్వ ఉత్తర్వు విడుదల చేశారు.

ఈ సంవత్సరం ఏప్రిల్ ప్రారంభంలో ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి భారత వైమానిక దళం అనుమతి ఇచ్చింది. ఈ స్థలంలో ఏఐఎఫ్ ఇప్పటికే దాదాపు 362 ఎకరాల భూమిని కలిగి ఉంది. అయితే, విమానాశ్రయ విస్తరణ, ప్రణాళికాబద్ధమైన వైమానిక దళ శిక్షణా కేంద్రం రెండింటినీ ఉంచడానికి అదనపు భూమి అవసరమని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గమనించింది.

కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2027 నాటికి ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆదిలాబాద్ నుండి ప్రయాణికుల విమాన సేవలకు మార్గం సుగమం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాల కోసం ప్రీ ఫీజిబిలిటీ స్టడీ నిర్వహిస్తు్న్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ ఫీల్డ్ విమానాశ్రయం అధ్యయనం చేయడానికి రూ.40.53 లక్షలను విడుదల చేసింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు విమానాశ్రయం ఏర్పాటుపై రిపోర్ట్ తయారు చేసిన సమర్పించనున్నారు.

నిజానికి బసంతనగర్ వద్ద పాత రన్ వే దగ్గర విమానాశ్రయం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాంతానికి ఇరుపులా గుట్టలు, హైటెన్షన్ వైర్లు ఉండటంతో అనుకూలం కాదని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండిడా అనుకుంది. ఈ మేరకు భూ భాగం, టెక్నాలజీ, ఆర్థికంగా అనుకూలం కాదని నివేదిక సమర్పించింది. మరోవైపు పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండల కేంద్రానికి దగ్గరలో 591.24 ఎకరాల స్థలాన్ని ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కేటాయించింది.

ఈ ఎయిర్‌పోర్టు ద్వారా పెద్దపల్లి ప్రజలకు, సింగరేణి సిబ్బందికి, విద్యార్థులు, వ్యాపార వర్గాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుంది. హైదరాబాద్‌కు గంటల కొద్దీ ప్రయాణం చేసే అవసరం ఉండదు. ప్రత్యక్ష కనెక్టివిటీ ఏర్పడుతుంది. అనేక అవకాశాలు లభిస్తాయి.