TGPSC Group 3 : గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ఈనెల 16న నియామక పత్రాలు అందజేత
గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం ముహుర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తారు.
గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. నియామక పత్రాలను అందజేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ఈనెల 16న నియామక పత్రాలు అందజేత
ఇటీవలనే తెలంగాణ గ్రూప్-3 తుధి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. 1,370 మంది అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లతో కూడిన ప్రొవిజినల్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలను గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించారు. మొత్తం 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు.
పరీక్షల నిర్వహణ తర్వాత వీటికి సంబంధించిన ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ ప్రక్రియంతా పూర్తి కావటంతో… గతేడాది మార్చిలో ఫలితాలను(జనరల్ ర్యాంకింగ్ లిస్ట్) ప్రకటించారు. అంతేకాకుండా ఫైనల్ కీలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తి కావటంతో… డిసెంబర్ 18వ తేదీన తుది ఫలితాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారు.