హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ను విమర్శించారు. పదేళ్ల పాలనలో సగటున రూ. 2 లక్షల కోట్ల వార్షిక ఆదాయం ఆర్జించినప్పటికీ, హైదరాబాద్లోని కొన్ని ఫ్లైఓవర్లతో సహా అనేక ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైనా విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఉన్న పరిశ్రమలను గుజరాత్కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. సెమీ కండక్టర్ల కంపెనీని ఆ రాష్ట్రానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
'1994 నుండి 2004 వరకు టీడీపీ 10 సంవత్సరాలు పాలించింది, 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ (అప్పటి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. 2014 నుండి బీఆర్ఎస్ తెలంగాణను దాదాపు 10 సంవత్సరాలు పాలించింది, మళ్ళీ 2024 నుండి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇదే ప్రజల తీర్పు.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. బిజెపి డిపాజిట్ కోల్పోతుందని, బీఆర్ఎస్ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ పథకాలను ఏవీ నిలిపివేయలేదని, కొన్నింటిని విస్తరించామన్నారు.
గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్యకు పాల్పడి బీజేపీకి తన అవయవాలను దానం చేసిందని కామెంట్ చేశారు సీఎం రేవంత్. 2024లో కాషాయ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. 'బీఆర్ఎస్ను బీజేపీతో విలీనం చేయడం ప్రారంభమైందని కేసీఆర్ కుమార్తె స్వయంగా చెబుతోంది. బీఆర్ఎస్కు గతం మాత్రమే ఉంది. దానికి భవిష్యత్తు లేదు. దాని 25 ఏళ్ల జీవితం ముగిసింది.' అని సీఎం అన్నారు.
జూబ్లీహిల్స్లోని ఓటర్లను తన పార్టీకి మద్దతు ఇవ్వమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటివరకు విజ్ఞప్తి చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి జనాభా గణనను విజయవంతంగా నిర్వహించిందని, కేంద్రం తెలంగాణ నమూనాను అనుసరిస్తుందని చెప్పారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70 శాతం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు స్థాపించినట్టుగా తెలిపారు.
{{/usCountry}}జూబ్లీహిల్స్లోని ఓటర్లను తన పార్టీకి మద్దతు ఇవ్వమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటివరకు విజ్ఞప్తి చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి జనాభా గణనను విజయవంతంగా నిర్వహించిందని, కేంద్రం తెలంగాణ నమూనాను అనుసరిస్తుందని చెప్పారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70 శాతం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు స్థాపించినట్టుగా తెలిపారు.
{{/usCountry}}