తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మోతే గ్రామం సరిహద్దుల్లో సంచలనం సృష్టించిన దంపతుల జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన ఒక పోలీస్ కానిస్టేబుల్తో పాటు అతని అనుచరుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..?
ఆగస్టు 11వ తేదీ రాత్రి మోతే గ్రామం వెలుపల ఉన్న ఒక వ్యవసాయ పొలంలో సుమారు 40 ఏళ్ల వయస్సున్న భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. మరుసటి రోజు వారి మృతదేహాలు సగం పూడ్చిపెట్టిన స్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాలను వెలికితీసి, దర్యాప్తు ప్రారంభించాయి.
కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించారు. జంట హత్యలు జరిగిన 24 గంటల వ్యవధిలోనే మోతే గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని, సూర్యాపేటలోని కొత్త బస్సు స్టాండ్ సమీపంలో విధుల్లో ఉన్న సదరు కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఇద్దరూ తాము చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పత్రికా ప్రకటనలో తెలిపారు.
హత్యకు దారితీసిన కారణాలు….
కుటుంబ తగాదాల విషయమై బాధితులు గతంలో మోతె పోలీస్ స్టేషన్కు తరచూ వచ్చేవారని పోలీసు అధికారుల విచారణలో తేలింది. ఆ సమయంలో తమ అల్లుడు డబ్బు కోసం వేధిస్తున్నాడని, ఆర్థికంగా సహాయం చేయాలని వారు సదరు కానిస్టేబుల్ను కోరారు. దీనితో ఆ కానిస్టేబుల్ వారికి దాదాపు రూ.3 లక్షల వరకు అప్పుగా ఇచ్చాడు. అయితే…. ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించకపోగా, ఆ కానిస్టేబుల్పైనే కేసు పెడతామని సదరు దంపతులు బెదిరింపులకు దిగారు. దీంతో ఆందోళన చెందిన కానిస్టేబుల్ వారిని అంతమొందించాలని పథకం పన్నాడని పోలీస్ అధికారి వెల్లడించారు.
పక్కా పథకం ప్రకారం హత్య…
గొర్రెల పెంపకం రుణం ఇప్పిస్తానని చెప్పి కానిస్టేబుల్ ఆ దంపతులను నమ్మించాడు. రుణం మంజూరు కావాలంటే తనిఖీల కోసం గొర్రెలను చూపించాలని…. అందుకోసం ఊరి బయట నీటి వసతి ఉన్న చోట గొర్రెలను ఉంచాలని చెప్పి వారిని ఒప్పించాడు.
పథకం ప్రకారం… కానిస్టేబుల్, రెండో నిందితుడు కలిసి మొదట భర్తను ద్విచక్రవాహనంపై ఊరి చివర ఉన్న పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అతడితో గుంత తవ్విస్తుండగా, ఉన్నట్టుండి రాతితో తలపై బలంగా బాది హత్య చేశారు. అతడు మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత, ఆ మృతదేహాన్ని తవ్విన గుంతలోనే పూడ్చిపెట్టారు.
{{/usCountry}}పథకం ప్రకారం… కానిస్టేబుల్, రెండో నిందితుడు కలిసి మొదట భర్తను ద్విచక్రవాహనంపై ఊరి చివర ఉన్న పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అతడితో గుంత తవ్విస్తుండగా, ఉన్నట్టుండి రాతితో తలపై బలంగా బాది హత్య చేశారు. అతడు మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత, ఆ మృతదేహాన్ని తవ్విన గుంతలోనే పూడ్చిపెట్టారు.
{{/usCountry}}ఆ తర్వాత, ఫొటోలు తీయాలనే నెపంతో భార్యను కూడా అదే ప్రదేశానికి రప్పించారు. ఆమెను కూడా దారుణంగా హత్య చేసి, పక్కనే ఉన్న మరో గుంతలో పూడ్చిపెట్టారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.