గురుకుల అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశానికి 14న కౌన్సెలింగ్.. ఈ పత్రాలు ఉండాలి!

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల అగ్రికల్చర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నవంబర్ 14న కౌన్సెలింగ్‌ జరగనుంది. అభ్యర్థులు సంబంధిత పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

Updated on: Nov 12, 2025 3:45 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల అగ్రికల్చర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నవంబర్ 14న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టుగా ప్రకటన విడుదలైంది. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

గురుకుల అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశానికి 14 కౌన్సెలింగ్
గురుకుల అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశానికి 14 కౌన్సెలింగ్

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలోని వివిధ వ్యవసాయ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి B.Sc (ఆనర్స్) వ్యవసాయ కోర్సులో ప్రవేశలకు కౌన్సెలింగ్ జరగనుంది. అభ్యర్థులకు వారి TG EAPCET-2025 ర్యాంకుల ఆధారంగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ(PJTAU) క్యాంపస్‌లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ జరుగుతుంది.

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు పుట్టిన తేదీకి సంబంధించిన రుజువును చూపించే ఎస్ఎస్‌సీ మార్కుల మెమో లేదా తత్సమాన సర్టిఫికేట్ చూపించాలి. అర్హత పరీక్షలో (ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్ష) దరఖాస్తుదారు పొందిన మార్కుల మెమో, ఉత్తీర్ణత సర్టిఫికేట్ ఉండాలి.

2025-26 సంవత్సరానికి ఆదాయ సర్టిఫికేట్: గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అభ్యర్థులకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,50,000/- (రూపాయలు ఒక లక్ష యాభై వేలు మాత్రమే), పట్టణ ప్రాంతంలో నివసించే అభ్యర్థులకు రూ.2,00,000/- (రూపాయలు రెండు లక్షలు మాత్రమే) మించకూడదు.

TG EAPCET- 2025 ర్యాంక్ కార్డ్ ఉండాలి. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు/6వ తరగతి నుండి డిప్లొమా వరకు బోనాఫైడ్/స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. చివరిగా చదివిన సంస్థ నుంచి టీసీ, ప్రభుత్వం నుంచి సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థులు పైన పేర్కొన్న అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.

తల్లిదండ్రులు, అభ్యర్థులు MJPTBCWREI సొసైటీ వెబ్‌సైట్ https://mjptbcwreis.telangana.gov.in/ & PJTAU వెబ్‌సైట్ https://www.pjtau.edu.in ని అప్డేట్స్ కోసం క్రమం తప్పకుండా ఫాలో కావాలి. ఈ నోటిఫికేషన్ వ్యక్తిగత సమాచారంగా పరిగణించాలని, ప్రత్యేక సమాచారం జారీ చేయరు. అభ్యర్థులు పైన సూచించిన ర్యాంకుల ప్రకారం షెడ్యూల్ చేసిన తేదీ, సమయంలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. అభ్యర్థులు కౌన్సెలింగ్ సమయంలో సంబంధిత అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్‌లను సమర్పించాలి. లేదంటే అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది.

ఈ లింక్ క్లిక్ చేసి పీడీఎఫ్ చదవండి.

News/Telangana/గురుకుల అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశానికి 14న కౌన్సెలింగ్.. ఈ పత్రాలు ఉండాలి!
News/Telangana/గురుకుల అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశానికి 14న కౌన్సెలింగ్.. ఈ పత్రాలు ఉండాలి!