మిషన్ కాకతీయ ప్రాజెక్టులో ప్రైవేట్ పట్టా భూములను సరైన ప్రక్రియ లేకుండా చేర్చినందుకు తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ అధికారులను మందలించింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లాల గ్రామానికి చెందిన బోనం సంజీవ రెడ్డి అనే రైతు, మరో ఏడుగురు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కలెక్టర్ను ఆదేశించింది.

పిటిషనర్లు పేర్కొన్న సర్వే నంబర్ 29 పూర్తిగా చెరువు మధ్యలో ఉందని, చెరువు మధ్యలో పట్టాలు ఎలా ఇస్తారు అని హైకోర్టు ప్రశ్నించింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నారని పేర్కొంది. రాష్ట్రంలో ఎఫ్టీఎల్ నిర్ణయించని కారణంగానే ఈ సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలకు మానవులే బాధ్యులు, దీనికి ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అని జస్టిస్ అనిల్ కుమార్ జుకుంటి ధర్మాసనం వ్యాఖ్యానించింది. రెవెన్యూ శాఖను సంస్కరించకపోతే దేశం బాగుపడదని న్యాయమూర్తి అన్నారు. ఈ విషయంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఖమ్మం కలెక్టర్ను ఆదేశించారు.
కౌంటర్ దాఖలు చేయడంలో విఫలమైతే అదనపు కోర్టు చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరింది కోర్టు. విచారణను వారం రోజుల పాటు వాయిదా వేశారు.
నవంబర్ 4న జరిగిన విచారణ సందర్భంగా.. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్, నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ పట్టా భూమిని సేకరించకుండా లేదా యజమానికి నోటీసులు జారీ చేయకుండా ప్రాజెక్టులో భాగంగా తీసుకున్నారని వాదించారు. ఈ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, రాజ్యాంగ నిబంధనలు, సహజ న్యాయం సూత్రాలకు విరుద్ధమని, పిటిషనర్ల భూమిలో అధికారులు జోక్యం చేసుకోకుండా నిరోధించాలని కోర్టును కోరారు.
కొత్త ప్రాజెక్టుల కోసం మాత్రమే భూసేకరణ చేపట్టారని, FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతంలోని భూములకు పరిహారం అందించలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. FTL పెంచితే ప్రైవేట్ భూమిపై ప్రభావం పడుతుందని, బ్యాక్ వాటర్స్లో మునిగిపోతే పరిహారం మంజూరు చేయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.
{{/usCountry}}కొత్త ప్రాజెక్టుల కోసం మాత్రమే భూసేకరణ చేపట్టారని, FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతంలోని భూములకు పరిహారం అందించలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. FTL పెంచితే ప్రైవేట్ భూమిపై ప్రభావం పడుతుందని, బ్యాక్ వాటర్స్లో మునిగిపోతే పరిహారం మంజూరు చేయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.
{{/usCountry}}ప్రైవేట్ భూమిని అధికారులు ఎలా నిర్ణయించగలరని న్యాయమూర్తి ప్రశ్నించారు. FTL సరిహద్దులపై స్పష్టత లేకపోవడం వల్ల అనేక పిటిషన్లు దాఖలయ్యాయని ప్రభుత్వాన్ని విమర్శించారు. 37 ఎకరాల చెరువు పరిధిలోని 27 ఎకరాల పట్టా భూమిని క్లెయిమ్ చేసిన కేసును గుర్తు చేస్తూ.. రెవెన్యూ, నీటిపారుదల అధికారుల చర్యలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.