...
...
Next Story

హైదరాబాద్‌‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు - ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లో డ్రగ్స్‌ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Published on: Nov 6, 2025, 22:20:26 IST
Advertisement

ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో తరుచుగా డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపుతోంది. తాజాగా రాజేంద్రనగర్ పరిధిలో ఓ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. వీరంతా ఎండీఎంఏ, గంజాయి సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

డ్రగ్స్ ముఠా అరెస్ట్
డ్రగ్స్ ముఠా అరెస్ట్

విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసు బృందాలు మొదట ఆరాంఘర్ రోడ్ సమీపంలో మాదకద్రవ్యాల సరఫరాదారుల బృందాన్ని అడ్డగించాయి. విచారణ అనంతరం రాజేంద్రనగర్ లో ముగ్గురు వినియోగదారులను అరెస్టు చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (రాజేంద్రనగర్ జోన్) యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.

నిందితుల నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ, 130 గ్రాముల గంజాయి, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఔషధాల విలువను ఇంకా వెల్లడించలేదు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, రాజమండ్రితో పాటు బెంగళూరుకు చెందిన వాళ్లు సరఫరాదారులుగా ఉన్నట్లు గుర్తించారు. వీరంతా సిండికేట్ మార్గంలో పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

18 గ్రాముల ఎండీఎంఏ, 130 గ్రాముల గంజాయిని బెంగళూరు నుంచి హైదరాబాద్ కు రవాణా చేసి బ్యాగుల్లో దాచి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఆరామ్ఘర్ రోడ్డుకు చేరుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు విషయం బయటికి రావటంతో… ముగ్గురిని ముందుగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపారు. పరారీలో ఉన్న సరఫరాదారుని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks