ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై స్పందిస్తూ…. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ అనుమతించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

"మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్ సర్కార్" అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
“హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం” అని హరీశ్ రావు దుయ్యబట్టారు.
“స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. అక్రమ కేసులతో కేటీఆర్, బిఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కేటీఆర్ కు బిఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం” అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
అప్రజాస్వామికం - మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయకక్ష సాధింపు చర్యలకు దిగిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ప్రతి పక్షాన్ని, ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్యనికి తూట్లు పొడవటమేనని చెప్పారు.
“మా ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకతతో ఫార్ములా ఈ రేస్ నిర్వహించాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం. అక్రమ కేసులతో కేటీఆర్, బిఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు” అని సబితా ఇంద్రారెడ్డి ప్రకటన విడుదల చేశారు.
{{/usCountry}}“మా ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకతతో ఫార్ములా ఈ రేస్ నిర్వహించాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం. అక్రమ కేసులతో కేటీఆర్, బిఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు” అని సబితా ఇంద్రారెడ్డి ప్రకటన విడుదల చేశారు.
{{/usCountry}}