BRS MLAs Defection Case : స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తాం - సుప్రీంకోర్టు

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. మరో మూడు వారాలకు వాయిదా వేసింది. ఆలోపు స్పీకర్ నిర్ణయం ప్రకటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

Published on: Feb 06, 2026 1:23 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సుప్రీంకోర్టులో BRS ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై మరోసారి విచారణ జరిగింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరికొంత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరపు న్యాయవాది కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం… … స్పీకర్ కు మరో మూడు వారాల గడువు ఇచ్చింది. గడువులోగా పూర్తి చేయకపోతే స్పీకర్ పై కోర్టు ధిక్కార చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… ఇప్పటికే స్పీకర్ 3 సార్లు సమయం తీసుకున్నారని గుర్తు చేశారు. జనవరి 16 తర్వాత… జనవరి 30న తదుపరి విచారణ చేపట్టారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు న్యాయస్థానం స్పందిస్తూ…. “మార్చి నాటికి పూర్తవుతాయని వారు చెబుతున్నారు. 3 వారాల తర్వాత జాబితా చూస్తాం. స్పీకర్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము, లేకుంటే మేము కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటాం” అని బదులిచ్చింది.

స్పీకర్ తరపు న్యాయవాదిగా ఉన్న అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ… ఇప్పటికే 8 పిటిషన్లపై విచారణ పూర్తి అయిందని… మరో 2 రెండింటిని కూడా పూర్తి చేస్తారని కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… 3 వారాల గడువు ఇస్తూ విచారణన వాయిదా వేసింది.

ఈ కేసుపై జనవరి 16వ తేదీన విచారణ జరిగింది. స్పీకర్ విజ్ఞప్తి మేరకు… 4 వారాల గడువు ఇచ్చింది. ఇదే చివరి అవకాశమని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి విచారణ జరపగా… స్పీకర్ మరోసారి గడువు కోరారు. ఈ నేపథ్యంలో 3 వారాల గడువు ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.