శంషాబాద్ వద్ద ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం : ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం!

ORR Accident : హైదరాబాద్‌ శంషాబాద్‌ వద్ద ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనక నుంచి వచ్చి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Published on: May 1, 2026, 17:27:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మరోసారి నెత్తురోడింది. శంషాబాద్ వద్ద జరిగిన ఒక భయంకర రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. అతివేగం ప్రాణసంకటంగా మారి ఆరుగురిని బలితీసుకుంది. శంషాబాద్ పరిధిలోని ఎగ్జిట్-16 వద్ద రోడ్డు పక్కన ఆగివున్న ఒక లారీని, వెనుక నుంచి వచ్చిన కారు అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. కారు లారీ వెనుక భాగంలోకి దూసుకుపోయి నుజ్జునుజ్జయ్యింది.

శంషాబాద్ వద్ద ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం
శంషాబాద్ వద్ద ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం

మృతుల్లో ఇద్దరు చిన్నారులు…

ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కారు లారీ కింద ఇరుక్కుపోవడంతో మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రాథమిక సమాచారం ప్రకారం అతి వేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా సిరిసిల్లకు చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. యాదగిరిగుట్ట వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరువుతున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More