హైదరాబాద్ ఐఐసీటీలో ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలివే
హైదరాబాద్లోని ఐఐసీటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 10 టెక్నీషియన్ పోస్టులను రిక్రూట్ చేస్తారు. https://www.iict.res.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
హైదరాబాద్ తార్నాకలోని సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాగా… డిసెంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

హైదరాబాద్ IIICT నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
- ఉద్యోగ నోటిఫికేషన్ - సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్
- ఉద్యోగాలు -టెక్నీషియన్
- మొత్తం ఖాళీలు - 10 (అన్ రిజర్వ్ డ్ - 6, ఎస్సీ 2, ఓబీసీ 1,ఈడబ్యూఎస్ -01)
- అర్హతలు - పదో తరగతి ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
- ఎంపికైన వారికి నెలకు రూ. 39,545 జీతం చెల్లిస్తారు.
- వయోపరిమితి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కొన్ని సడలింపులు ఉన్నాయి.
- ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. పేపర్, 2, 3లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- మల్టిపుల్ ఛాయిస్(150 ప్రశ్నలు) విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తు ఫీజు - రూ. 500 చెల్లించాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ - 30 డిసెంబర్ 2025
- అధికారిక వెబ్ సైట్ - https://www.iict.res.in/HOME
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

