Illegal Stone Crushing Hyderabad : నగర శివార్లలోని ప్రకృతిని, భూగర్భ జలాలను, ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న అక్రమ మైనింగ్ మాఫియాపై హైడ్రా (HYDRAA) యుద్ధం ప్రకటించింది. బడా బాబుల అండదండలతో, ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న స్టోన్ క్రషింగ్, ఆర్ఎంసీ (RMC) ప్లాంట్లపై మంగళవారం ఉదయం ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించింది.
12 ప్లాంట్ల తొలగింపు…

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB), మైనింగ్ మరియు రెవెన్యూ శాఖల విజ్ఞప్తి మేరకు హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండలం గౌలిదొడ్డి, శంషాబాద్ మండలం కొత్వాల్గూడ గ్రామాల్లో ఈ ఆపరేషన్ కొనసాగింది.
6 స్టోన్ క్రషింగ్ యూనిట్లు పూర్తిగా నేలమట్టం చేయబడ్డాయి.12 ఆర్ఎంసీ (Ready Mix Concrete) ప్లాంట్లను అధికారులు తొలగించారు. భవిష్యత్తులో ఇక్కడ మైనింగ్ చేయడానికి వీలు లేకుండా భారీ యంత్ర సామగ్రిని సీజ్ చేసి అక్కడి నుంచి తరలించారు.
అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న వారిలో పేరున్న పెద్ద సంస్థలు ఉండటం గమనార్హం. గతంలో మైనింగ్ శాఖ హెచ్చరించినా బడా బాబుల రాజకీయ అండతో వీరు బేఖాతరు చేస్తూ వచ్చారు.
గౌలిదొడ్డిలో గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టినాగులపల్లిలో పరమేష్ సింగ్ స్టోన్ క్రషర్/శ్రీ లక్ష్మి కన్స్ట్రక్షన్స్, పృథ్వి స్టోన్ క్రషర్, కొత్వాల్గూడలో రాఘవ స్టోన్ క్రషర్, మక్తా భగత్ సింగ్ అనే వ్యక్తికి చెందిన యూనిట్లపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
ఈ అక్రమ యూనిట్లు రూ. వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. యథేచ్ఛగా బండ రాళ్లను పేల్చడం వల్ల సమీపంలోని నివాస ప్రాంతాలు ప్రమాదంలో పడ్డాయి. క్రషింగ్ వల్ల వచ్చే విపరీతమైన దుమ్ముతో స్థానికులు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ యూనిట్లకు కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు ఉండటంతో కనెక్షన్ కట్ చేసినా.. డీజిల్ జనరేటర్లతో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లేఖతో కదిలిన హైడ్రా, కోర్ అర్బన్ రీజినల్ ఎకానమీ (CURE) పరిధిలో చేపట్టిన ఈ చర్యలతో పరిసర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
{{/usCountry}}రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లేఖతో కదిలిన హైడ్రా, కోర్ అర్బన్ రీజినల్ ఎకానమీ (CURE) పరిధిలో చేపట్టిన ఈ చర్యలతో పరిసర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
{{/usCountry}}