భారత కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్) మాజీ టాప్ కమాండర్, కీలక వ్యూహకర్త తిప్పిరి తిరుపతి అలియాస్ దేవూజీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 24న తెలంగాణ పోలీసులకు లొంగిపోయే ముందు తనను, ఇతరులను అరెస్టు చేశారని పేర్కొన్నారు.

చట్టపరమైన విధానంలో ప్రజల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తానని తిప్పిరి తిరుపతి ప్రతిజ్ఞ చేశారు. సాయుధ పోరాటంలో నాలుగు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితాన్ని గడిపిన దేవూజీ.. తాను, ఇతర సభ్యులు మరణ భయం కారణంగా పోలీసులకు లొంగిపోలేదని స్పష్టం చేశారు. చట్టపరమైన చట్రంలో తమ భావజాలం, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సిద్ధాంతాలను నమ్మె ప్రజల కోసం పనిచేయడానికే లొంగిపోయామని కూడా అన్నారు.
తాను ఎప్పుడూ మరణానికి భయపడనని, అలా అయితే.. గత ఏడాది అక్టోబర్లో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు కీలక మావోయిస్టు నాయకులు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను, ఆశన్న అలియాస్ సతీష్ లాగా లొంగిపోయేవాడినని దేవూజీ వ్యాఖ్యానించారు.
'ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పుడు, అనివార్య పరిస్థితులలో పార్టీని బలోపేతం చేయడానికి మేం వేర్వేరు ప్రదేశాలలో ఆశ్రయం పొందాం. ఆ పరిస్థితులలో తెలంగాణ పోలీసులు మమ్మల్ని అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత వారు కోరుకుంటే.. మమ్మల్ని చంపి ఉండేవారు. కానీ వారు మాకు చెప్పింది ఏమిటంటే, చంపడం వారి విధానం కాదని, లొంగిపోవడాన్ని చూపిస్తామని చెప్పారు..' అని దేవూజీ చెప్పారు.
పోలీసుల ముందు లొంగిపోయారనే భావనను తోసిపుచ్చారు దేవూజీ. గతంలో అడవుల్లో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించుకునేవారమని అన్నారు. ఇప్పుడు చట్టపరమైన పద్ధతులను ఉపయోగించి బహిరంగంగా కూడా అదే చేస్తామని స్పష్టం చేశారు.
మార్క్సిజం, లెనినిజం, మావోయిజం భావజాలాన్ని తాను వదులుకోనని దేవూజీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తామన్నారు. 'మేం లొంగిపోయామని లేదా ప్రధాన స్రవంతిలో చేరామని చెప్పడం సరైనది కాదు. మేం ఎల్లప్పుడూ వేలాది మందితో సంప్రదిస్తాం.' అని అన్నారు.
తాను పార్టీ ప్రధాన కార్యదర్శిని కాదని, కేవలం కేంద్ర కమిటీ సభ్యుడిని మాత్రమేనని తిప్పిరి తిరుపతి చెప్పారు. నాలుగు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితం తర్వాత, ఫిబ్రవరి 24న దేవూజీని తెలంగాణ పోలీసులు లొంగిపోయినట్టుగా చూపించారు. దేవూజీతో పాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజి రెడ్డి, మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు బడే చొక్కారావు అలియాస్ జగన్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న కూడా ఆయుధాలు వదిలేశారు.
{{/usCountry}}తాను పార్టీ ప్రధాన కార్యదర్శిని కాదని, కేవలం కేంద్ర కమిటీ సభ్యుడిని మాత్రమేనని తిప్పిరి తిరుపతి చెప్పారు. నాలుగు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితం తర్వాత, ఫిబ్రవరి 24న దేవూజీని తెలంగాణ పోలీసులు లొంగిపోయినట్టుగా చూపించారు. దేవూజీతో పాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజి రెడ్డి, మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు బడే చొక్కారావు అలియాస్ జగన్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న కూడా ఆయుధాలు వదిలేశారు.
{{/usCountry}}దేవూజీ తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందినవాడు . అతని తండ్రి వెంకట నర్సయ్య ఒక రైతు. దేవూజీ జనవరి 1982లో పీపుల్స్ వార్లో చేరారు. ఎక్కువగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలలో పనిచేశారు. అయితే బస్వరాజ్ ఎన్కౌంటర్ తర్వాత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవూజీ టాప్ కమాండర్గా బాధ్యతలు తీసుకున్నారని ప్రచారం జరిగింది.