తెలంగాణకు, కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయి.
ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్…

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం…. రాబోయే 2 - 3 గంటల్లో హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు(ఏప్రిల్ 25) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈనెల 26వ తేదీన పొడి వాతావరణం ఉండే అవకాశం ఉండగా.... 27వ తేదీ నుంచి మళ్లీ వర్షాలు పడనున్నాయి.మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో సోమవారం నాడు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఏప్రిల్ 28వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ,మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఏపీలోనూ వర్షాలు…
ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇవాళ భిన్న వాతావరణమే ఉండనుంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వర్షం సూచన ఉన్నప్పటికీ ఉక్కపోత, వేడి మరియు తేమతో కూడిన అసౌకర్య వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక రేపు, ఎల్లుండి (శని, ఆదివారాలు) పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
{{/usCountry}}ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇవాళ భిన్న వాతావరణమే ఉండనుంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వర్షం సూచన ఉన్నప్పటికీ ఉక్కపోత, వేడి మరియు తేమతో కూడిన అసౌకర్య వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక రేపు, ఎల్లుండి (శని, ఆదివారాలు) పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
{{/usCountry}}దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం పొడిగానే ఉండనుంది. వర్ష సూచన లేనప్పటికీ, ఉష్ణోగ్రతలు పెరగడం మరియు గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే రాయలసీమలో ఎండల తీవ్రత అత్యధికంగా ఉండనుంది. రాబోయే నాలుగు రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.