రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న జోరుకు అనుగుణంగా భూమి, రిజిస్ట్రేషన్ విలువలను సవరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి భూ లావాదేవీల రిజిస్ట్రేషన్ల కోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల(SRO) వద్ద భారీ రద్దీ నెలకొంది.

దీంతో తెలంగాణలో భూముల కొనుగోలు, అమ్మకాలు చేయాలనుకునే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని, మే 29 నుండి జూన్ 3 వరకు అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను పొడిగించింది. ఇకపై ఈ నిర్ణీత రోజుల్లో ఉదయం 9:30 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పుంజుకోవడంతో.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అసలు ధరలకు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి, భూముల ప్రభుత్వ విలువలను (మార్కెట్ విలువలను) సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలోనే భూముల విలువలు పెరుగుతాయనే ప్రచారంతో, పెరిగిన ధరల భారం పడకుండా ఉండేందుకు ప్రజలు ముందే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పోటెత్తుతున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సవరించిన పనివేళల గురించి అధికారిక ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే సాధారణ ప్రజలు గంటల తరబడి లైన్లలో నిలబడి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
డిమాండ్కు అనుగుణంగా ప్రతిరోజూ కేటాయించే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్ల సంఖ్యను కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా, సంబంధిత శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు.
మీ వద్ద భూమి, ప్లాట్ లేదా ఇళ్ల రిజిస్ట్రేషన్ పనులు పెండింగ్లో ఉంటే, ఈ పొడిగించిన సమయాన్ని (రాత్రి 7:30 వరకు) ఉపయోగించుకోవచ్చు. జూన్ 3 తర్వాత రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే అవకాశం ఉన్నందున, ముందే స్లాట్ బుక్ చేసుకోవడం ఉత్తమం.
ఈ నిర్ణయం వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, ప్రజలు ప్రశాంతంగా తమ రిజిస్ట్రేషన్ పనులు ముగించుకోవడానికి వీలవుతుంది. మీ డాక్యుమెంట్లను ముందే సిద్ధం చేసుకుని, పెరిగిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రస్తుతం ఉన్న రదీ అలాగే కొనసాగితే జూన్ 3 తర్వాత కూడా అదనపు పని వేళలు కొనసాగించే అవకాశం ఉంది.
{{/usCountry}}ఈ నిర్ణయం వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, ప్రజలు ప్రశాంతంగా తమ రిజిస్ట్రేషన్ పనులు ముగించుకోవడానికి వీలవుతుంది. మీ డాక్యుమెంట్లను ముందే సిద్ధం చేసుకుని, పెరిగిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రస్తుతం ఉన్న రదీ అలాగే కొనసాగితే జూన్ 3 తర్వాత కూడా అదనపు పని వేళలు కొనసాగించే అవకాశం ఉంది.
{{/usCountry}}