మే 29 నుండి జూన్ 3 వరకు రాత్రి 7:30 గంటల దాకా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

తెలంగాణలో మే 29వ తేదీ నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు రాత్రి 7.30 నిమిషాల వరకు పనిచేయనున్నాయి. రిజిస్ట్రేషన్లు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నది.

Updated on: May 28, 2026, 18:10:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న జోరుకు అనుగుణంగా భూమి, రిజిస్ట్రేషన్ విలువలను సవరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి భూ లావాదేవీల రిజిస్ట్రేషన్ల కోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల(SRO) వద్ద భారీ రద్దీ నెలకొంది.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు పని వేళలు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు పని వేళలు

దీంతో తెలంగాణలో భూముల కొనుగోలు, అమ్మకాలు చేయాలనుకునే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని, మే 29 నుండి జూన్ 3 వరకు అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను పొడిగించింది. ఇకపై ఈ నిర్ణీత రోజుల్లో ఉదయం 9:30 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పుంజుకోవడంతో.. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అసలు ధరలకు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి, భూముల ప్రభుత్వ విలువలను (మార్కెట్ విలువలను) సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

త్వరలోనే భూముల విలువలు పెరుగుతాయనే ప్రచారంతో, పెరిగిన ధరల భారం పడకుండా ఉండేందుకు ప్రజలు ముందే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పోటెత్తుతున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సవరించిన పనివేళల గురించి అధికారిక ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే సాధారణ ప్రజలు గంటల తరబడి లైన్లలో నిలబడి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

డిమాండ్‌కు అనుగుణంగా ప్రతిరోజూ కేటాయించే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్ల సంఖ్యను కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా, సంబంధిత శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు.

మీ వద్ద భూమి, ప్లాట్ లేదా ఇళ్ల రిజిస్ట్రేషన్ పనులు పెండింగ్‌లో ఉంటే, ఈ పొడిగించిన సమయాన్ని (రాత్రి 7:30 వరకు) ఉపయోగించుకోవచ్చు. జూన్ 3 తర్వాత రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే అవకాశం ఉన్నందున, ముందే స్లాట్ బుక్ చేసుకోవడం ఉత్తమం.

ఈ నిర్ణయం వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, ప్రజలు ప్రశాంతంగా తమ రిజిస్ట్రేషన్ పనులు ముగించుకోవడానికి వీలవుతుంది. మీ డాక్యుమెంట్లను ముందే సిద్ధం చేసుకుని, పెరిగిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రస్తుతం ఉన్న రదీ అలాగే కొనసాగితే జూన్ 3 తర్వాత కూడా అదనపు పని వేళలు కొనసాగించే అవకాశం ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More