తెలంగాణ రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ప్రయోగత్మకంగా అమలు చేస్తోంది రెవెన్యూ శాఖ. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమనగల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు రెవెన్యూ శాఖ విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించేందుకు ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుకు కిందకు తెస్తూ.. ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ను ప్రభుత్వం రూపొందించింది.

ఈ ఐదు మండలాల్లో వచ్చే ఫలితాల ఆధారంగా.. మార్పులు, చేర్పులు చేసి భవిష్యత్తులో ముందుకు వెళ్లనుంది ప్రభుత్వం. కేరళ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. భూభారతి పోర్టల్ గురించి ఇప్పటికే రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రైతు కోణంలో రూపొందించామన్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి భూ వివాదాల పరిష్కారానికి తొలి అడుగు వేస్తున్నట్టుగా చెప్పారు.
'భూభారతి పోర్టల్ ప్రారంభానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు ఈ పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. గతంలో మాదిరిగా రైతులు భూ సేవల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేదు. ఇంటి నుంచే భూ సేవలు పొందే విధంగా పోర్టల్ను రూపొందించాం.' మంత్రి పొంగులేటి చెప్పారు..
గతంలో రైతులు భూ సేవల కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇక మీదట ఇంటి నుంచే భూ సేవలు పొందవచ్చు. గతంలో రైతులు భూమి హద్దులు తేల్చేందుకు సర్వే అధికారుల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ఎక్కడకు వెళ్లాల్సిన అవరసం లేదు. ఇంటి నుంచి భూభారతి పోర్టల్ ద్వారా పొందవచ్చు. రైతు లాగిన్ అయిన తర్వాత భూమి వివరాలు కనపడతాయి. ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే.. దానికి సంబంధించిన ఫీజు ఎంత చెల్లించాలో చూపిస్తుంది. ఫీజు చెల్లించిన తర్వాత.. వివరాలు గ్రామంలో ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్ లాగిన్కు వస్తాయి.
ఇక రెండు రోజుల్లోనే సర్వే కావాలనుకున్న రైతు భూమికి ఆనుకుని ఉన్న రైతులకు నోటీసులు వెళ్తాయి. ఏడు రోజుల్లో సర్వే తేదీని లైసెన్స్డ్ సర్వేయర్ ఖరారు చేస్తారు. రోవర్లతో సర్వే కూడా పూర్తవుతుంది. సిస్టమ్లో నమోదు చేసిన తర్వాత.. మండల సర్వేయర్కు స్క్రూటినీకి వెళ్తుంది. ఆ తర్వాత తహసీల్దార్ ఆమోదం అనంతరం దరఖాస్తుదారైన రైతుకు ఎల్పీఎం, భూధార్ నంబర్ల కేటాయింపు చేస్తారు. ఈ వివరాలు భూభారతి పోర్టల్లో నిక్షిప్తమవుతాయి.
{{/usCountry}}ఇక రెండు రోజుల్లోనే సర్వే కావాలనుకున్న రైతు భూమికి ఆనుకుని ఉన్న రైతులకు నోటీసులు వెళ్తాయి. ఏడు రోజుల్లో సర్వే తేదీని లైసెన్స్డ్ సర్వేయర్ ఖరారు చేస్తారు. రోవర్లతో సర్వే కూడా పూర్తవుతుంది. సిస్టమ్లో నమోదు చేసిన తర్వాత.. మండల సర్వేయర్కు స్క్రూటినీకి వెళ్తుంది. ఆ తర్వాత తహసీల్దార్ ఆమోదం అనంతరం దరఖాస్తుదారైన రైతుకు ఎల్పీఎం, భూధార్ నంబర్ల కేటాయింపు చేస్తారు. ఈ వివరాలు భూభారతి పోర్టల్లో నిక్షిప్తమవుతాయి.
{{/usCountry}}ఈ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రారంభం నుంచి పూర్తయ్యేదాకా ప్రతి దశలోనూ రిజిస్టర్డ్ మెుబైల్ నెంబర్కు ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయి. ప్రతీ సర్వే మ్యాప్ యూనిక్ నెంబర్తోపాటుగా ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ నెంబర్ మాదిరిగానే.. భూధార్ నెంబర్ కూడా ఇస్తారు. ప్రస్తుతం 5 మండలాల్లో ఈ వ్యవస్థకు సంబంధించిన అన్ని అందుబాటులో ఉంచారు.