అరుణాచల శివయ్యను దర్శించుకోవాలని తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. ఇటీవలి కాలంలో అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షిణ చేసే వారి సంఖ్య పెరిగింది. అయితే అలాంటి వారికి గుడ్న్యూస్. ఐఆర్సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వెళ్లాలి అనుకుంటే ఈ స్పెషల్ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..
ఈ టూర్ ఎప్పుడు?

ఈ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం ఉంటుంది. నవంబర్ 7వ తేదీన ఈ టూర్ ఉంది. ఇందులో అరుణాచలం మాత్రమే కాదు పుదుచ్చేరి, కాంచీపురం కూడా చూడొచ్చు. కాచిగూడ నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు రైలు ఉంటుంది. నాలుగు రాత్రులు, ఐదు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ట్రైన్ ప్రయాణం, హోటల్ వసతి, ఆలయ దర్శనాలు ఉంటాయి.
ఐదు రోజులు
అరుణాచల మోక్ష యాత్ర ప్రతీ శుక్రవారం మెుదలవుతుంది. కాచిగూడ టూ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్లో మెుదటి రోజు అంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు అంటే శనివారం నాడు పుదుచ్చేరికి ఉదయం 11.05 గంటలకు చేరుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అవుతారు. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని.. ఆరోవిల్లే, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ చూస్తారు. రాత్రి పుదుచ్చేరిలోనే బస ఉంటుంది.
మూడో రోజు శనివారం ఉదయం హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి.. అరుణాచలం బయలుదేరుతారు. సుమారు 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ హోటల్లో చెకిన్ చేసిన తర్వాత అరుణాచలం శివయ్యను దర్శించుకోవచ్చు. గిరిప్రదక్షిణ చేయవచ్చు. రాత్రికి బస అరుణాచలంలోనే ఉంటుంది.
నాల్గో రోజు ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి కాంచీపురానికి బయలుదేరుతారు. అరుణాచలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కామాక్షి అమ్మన్ టెంపుల్, ఏకాంబరేశ్వర ఆలయం తీసుకెళ్తారు. తర్వాత 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరక్కోణం స్టేషన్ వెళ్తారు. తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఐదో రోజు సోమవారం ఉదయం కాచిగూడకు చేరుకోవడంతో అరుణాచల మోక్ష యాత్ర టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు
ఈ ప్యాకేజీ స్టాండర్డ్ స్లీపర్ క్లాస్, కంఫర్ట్ 3ఏసీ వేరియంట్లలో లభిస్తుంది. కంఫర్ట్ 3ఏసీ ట్విన్ షేరింగ్కు రూ.19130, ట్రిపుల్ షేరింగ్కు రూ.14740, చైల్డ్ విత్ బెడ్ రూ.10700, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.8060గా ఉంది. మరిన్ని ధరల వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ http://www.irctctourism.com సందర్శించాలి.
{{/usCountry}}ఈ ప్యాకేజీ స్టాండర్డ్ స్లీపర్ క్లాస్, కంఫర్ట్ 3ఏసీ వేరియంట్లలో లభిస్తుంది. కంఫర్ట్ 3ఏసీ ట్విన్ షేరింగ్కు రూ.19130, ట్రిపుల్ షేరింగ్కు రూ.14740, చైల్డ్ విత్ బెడ్ రూ.10700, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.8060గా ఉంది. మరిన్ని ధరల వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ http://www.irctctourism.com సందర్శించాలి.
{{/usCountry}}బ్రేక్ ఫాస్ట్ తప్ప, ట్రైన్లో ఆహారం, లంచ్, డిన్నర్ ఇందులో ఇవ్వరు. దర్శనాల కోసం ఎంట్రీ టికెట్స్, బోటింగ్, హార్స్ రైడింగ్, ఇతర ఏమైనా యాక్టివిటీస్ కోసం ఖర్చులను ప్రయాణికులే చూసుకోవాలి. అందుకే టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లోచూడండి.