Jubilee Hills By Election Result Live : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ హవా - 24,729 ఓట్ల తేడాతో విజయం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించిన నవీన్ యాదవ్… 24,729 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….

ఇవాళ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తేలింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్… ఈ ఉపఎన్నికలో విజయం సాధించారు.
...Read Moreజూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం - నవీన్ యాదవ్
“జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం. భారీ మెజారిటీతో నన్ను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారు. జూబ్లీహిల్స్ ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చెయ్యను. అందరితో కలుపుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా” అని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్పారు.
ముగిసిన ఉప ఎన్నిక కౌంటింగ్ - ఓట్ల శాతం
కాంగ్రెస్ - 98,988 (50.83%)
బీఆర్ఎస్ - 74,259 (38.13%)
బీజేపీ - 17,061 (8.76%)
ఈసీ అధికారిక ప్రకటన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్కు 74,259 ఓట్లు.. బీజేపీకి 17,061 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు.
పోరాటం కొనసాగిస్తాం - కేటీఆర్
ఉపఎన్నిక ఫలితంపై కేటీఆర్ స్పందించారు. పారదర్శకంగా ఎన్నికలో పని చేశామన్నారు. ప్రజా సమస్యలను ప్రజల్లో చర్చకు పెట్టామని వివరించారు. తమ పోరాటం నిరంతరం కొనసాగుతోందన్నారు.
మెజార్టీ ఎంతంటే
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24658 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
కాంగ్రెస్ విజయం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించిన నవీన్ యాదవ్… 24 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
నైతిక విజయం నాదే - మాగంటి సునీత
నైతికంగానే తానే విజయం సాధించాని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలు కలిసి వచ్చాయని… రిగ్గింగ్ చేసి ఇక్కడ ఓడించారని ఆరోపించారు.
రిగ్గింగ్ తోనే వారి విజయం - సునీత
రిగ్గింగ్ తో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఆరోపించారు. ఓ మహిళపై ఇంత అన్యాయం చేయటం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. రౌడీ రాజ్యంగా ఈ ఉపఎన్నిక జరిగిందన్నారు.
24 వేల ఓట్ల ఆధిక్యం
10వ రౌండ్ లోనూ కాంగ్రెస్ కే లీడ్ వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం 24 వేలకుపైగా ఓట్ల ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ సాధించారు.
కాంగ్రెస్ ఘన విజయం
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపినాథ్పై దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు. కాసేపట్లో అధికారికంగా ఎన్నికల కమిషన్ ప్రకటన చేయనుంది.
23,612 ఓట్ల ఆధిక్యం
9వ రౌండ్లో కాంగ్రెస్కు 2,117 ఓట్ల మెజార్టీ దక్కింది. దీంతో 9 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్… 23,612 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
వచ్చే 8 ఏళ్లు మాదే అధికారం - పీసీసీ చీఫ్
కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పీపీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వంద సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 8 ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు.
దూసుకెళ్తున్న కాంగ్రెస్
జూబ్లీహిల్స్ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఎనిమిదో రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి 24,800 ఓట్లతో లీడ్లో ఉన్నారు.
విజయం దిశగా కాంగ్రెస్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. 50 శాతానికిపైగా ఓట్లు కూడా దక్కే అవకాశం ఉంది.
కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన దీపక్ రెడ్డి
కౌంటింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ఈ ఉపఎన్నికలో డబ్బు ప్రభావం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
7వ రౌండ్ లోనూ లీడ్
7వ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 4 వేలకుపైగా లీడ్ లభించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 19 వేల లీడ్ లో ఉన్నారు.
15,589 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఆరో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. 6వ రౌండ్లో కాంగ్రెస్కు 2,938 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్కు 15,589 ఓట్ల లీడ్ లో ఉంది.
పెరుగుతున్న ఆధిక్యం
ఆరో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీనే లీడ్ లో ఉంది. ఈ రౌండ్ తర్వాత 15 వేల ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నారు.
గాంధీ భవన్ లో సంబరాలు
గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎన్నిక ఏదైనా సరే తమదే విజయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
దూసుకెళ్తున్న కాంగ్రెస్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ లో 5వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీకి 12,651 ఓట్ల మెజారిటీ లీడ్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ రౌండ్ లో కూడా 3 వేలకుగా లీడ్ లభించినట్లు సమాచారం.
బీజేపీకి థర్డ్ ప్లేస్
బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రతి రౌండ్ లోనూ ఆశించిన స్థాయిలో ఓట్లు దక్కడం లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ కొనసాగుతోంది.
బీఆర్ఎస్ కు లీడ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు స్వల మెజార్టీ దక్కింది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు 211 ఓట్ల లీడ్ దక్కింది. మూడు రౌండ్లు పూర్తి కాగా… కాంగ్రెస్ ఇంకా 900 ఓట్లకుపైగా లీడ్ లో ఉంది.
గెలువబోతున్నాం - పీసీసీ చీఫ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తప్పకుండా కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పారు.
లీడ్ లో కాంగ్రెస్
జూబ్లీహిల్స్ రెండో రౌండ్ లో కాంగ్రెస్కు 9,691, బీఆర్ఎస్కు 8,609 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు 1082 లీడ్ రాగా… మొదటి 2 రౌండ్లు కలిపి 1144 లీడ్ దక్కింది.
రెండో రౌండ్ పూర్తి..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ కు లీడ్ లభించింది. రెండు రౌండ్లు కలిపి 1,082 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.

E-Paper

