సుక్మా అడవుల్లో మావోయిస్టు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం.. భారీ మొత్తంలో ఆయుధాలు!

మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా సుక్మా జిల్లా అడవుల్లో మావోయిస్ట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Published on: Nov 4, 2025, 16:01:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సుక్మా జిల్లా అడవి ప్రాంతాల్లో కొనసాగుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా దళాలు మరో ప్రధాన విజయాన్ని సాధించాయి. జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం అడవిలో లోపల నక్సలైట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కనిపెట్టింది. ఇది మావోయిస్టుల ఆయుధాల తయారీ, మరమ్మత్తుకు ప్రధాన స్థావరంగా ఉందని తెలుస్తోంది.

మావోయిస్ట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం
మావోయిస్ట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం

సుక్మా జిల్లా గోంగూడ, కంచాల అడవుల్లో కూంబింగ్ సమయంలో డీఆర్జీ బలగాలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని గుర్తించాయి. ఈ ఆపరేషన్ సమయంలో భద్రతా దళాలు మొత్తం 17 రైఫిళ్లు, బీజీఎల్ రాకెట్ లాంచర్లు, సింగిల్-షాట్ రాకెట్ లాంచర్లు, దేశీయంగా తయారు చేసిన పిస్టల్స్, పెద్ద మొత్తంలో గన్‌పౌడర్, వైర్, బోర్‌హోల్ యంత్రాలు, డ్రిల్ యంత్రాలు, పైపులు, హ్యాండ్ డ్రిల్ యంత్రాలు, షీల్డ్‌లు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. పోలీసుల ప్రకారం, మావోయిస్టులు చాలా కాలంగా ఇక్కడ ఆయుధాలను మరమ్మతు చేసి తయారు చేస్తున్నారు.

డీఆర్‌జీ తీసుకున్న ఈ వ్యూహాత్మక చర్య మావోయిస్టు నెట్‌వర్క్‌కు తీవ్ర దెబ్బ తగిలింది. నిఘా సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించి, ఎటువంటి ప్రాణనష్టం లేకుండా విజయాన్ని సాధించాయి. మావోయిస్టులకు మిగిలి ఉన్న ఏకైక మార్గం హింసను విడిచిపెట్టి, లొంగిపోయి, ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావడమేనని సుక్మా పోలీసులు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ నక్సలిజం బాధితుల ఉపశమనం మరియు పునరావాస విధానం-2025 ప్రకారం, లొంగిపోయిన వారికి భద్రత, గౌరవం, పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

లొంగిపోయిన వారి పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని, వారి కుటుంబాలకు ప్రశాంతమైన జీవితం గడిపే అవకాశం లభిస్తుందని పోలీసులు తెలిపారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ మాట్లాడుతూ, 'నక్సలిజాన్ని నిర్మూలించడం మాత్రమే కాకుండా, ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, అభివృద్ధిని నెలకొల్పడం కూడా మా లక్ష్యం. హింసను విడిచిపెట్టి ప్రధాన స్రవంతి సమాజంలోకి తిరిగి వచ్చే మావోయిస్టులకు ప్రభుత్వ పునరావాస విధానం కింద గౌరవప్రదమైన జీవితాన్ని, సురక్షితమైన భవిష్యత్తును ఇస్తాం.' అని ఎస్పీ తెలిపారు.

కొంత కాలంగా మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు లొంగిపోయారు. వారితోపాటుగా చాలా మంది మావోయిస్టులు ఉన్నారు. మరోవైపు ఆపరేషన్ కగార్‌తో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై విరుచుకుపడుతుంది. అడవులు మెుత్తం జల్లెడ పడుతోంది. 2026 మార్చి నాటికి నక్సలిజం లేకుండా చేస్తామని ఇప్పటికే చాలా సార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More