త్వరలోనే వైద్యారోగ్యశాఖ నుంచి మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు - కీలక ప్రకటన

ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రతి పోస్టునూ రిక్రూట్ చేస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర స్పష్టం చేశారు. త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. రెండేళ్లలో 9572 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.

Published on: Jan 14, 2026 2:22 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో మరో భారీ నియామక ప్రక్రియ పూర్తయింది. ఒకేసారి 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు (గ్రేడ్-2) నియామక పత్రాలను అందజేసే కార్యక్రమం మంగళవారం కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ప్రకటన చేశారు.

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాం - మంత్రి దామోదర

ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో 70 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని మంత్రి దామోదర గుర్తు చేశారు. ఒక్క ఆరోగ్య శాఖలోనే ఇప్పటివరకు 9,572 పోస్టులను భర్తీ చేశామని, మరో 7,267 పోస్టుల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతి ఉన్న మరో 996 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదనంగా 2,344 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపామని మంత్రి స్పష్టం చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా వేగంగా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నారు. 2024 సెప్టెంబర్ 11న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2025 నవంబర్ నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మొత్తం 23,323 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 1257 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. డీఎంఈ పరిధిలో 764, డీపీహెచ్‌లో 300, టీవీవీపీలో 180, ఎంఎన్‌జేలో 13 మందికి పోస్టింగ్స్ ఇచ్చామన్నారు.

తెలంగాణను ఆరోగ్య రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి దామోదర పేర్కొన్నారు. ఉస్మానియా నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, ప్రతీ జిల్లాలో ఎన్‌సీడీ క్లినిక్స్, క్యాన్సర్ డే కేర్ సెంటర్లు, ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్, గాంధీ ఆసుపత్రిలో ఉచిత ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను సెకండరీ హెల్త్ కేర్‌గా మారుస్తున్నామని మంత్రి వెల్లడించారు.

త్వరలోనే నూతన హెల్త్ పాలసీని రూపొందించి, అమలు చేయబోతున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ్మ తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న ఆరోగ్యశాఖను సీఎం రేవంత్ రెడ్డి తనకు ఇచ్చారని…. ఈ శాఖకు మంత్రిగా ఉన్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని మంత్రి వెల్లడించారు.