నాగార్జున సాగర్ టు శ్రీశైలం : కృష్ణమ్మ అలలపై లాంచీ యాత్ర, రూ. 2 వేలకే ట్రిప్, ప్యాకేజీ వివరాలివే

టూరిస్టులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది.నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ టూర్ పై ప్రకటన చేసింది. నవంబర్ 22 నుంచి ఈ టూర్ ప్యాకేజీని ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Published on: Nov 21, 2025 1:51 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు… మరోవైపు చుట్టూ కొండలు… మరికొంత దూరం వెళ్తే నలమల్ల ఫారెస్ట్ అందాలు… ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించవచ్చు. ఏకంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణంలో చేయవచ్చు. ఇందుకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. జర్నీ తేదీలను కూడా ప్రకటించింది.

సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ యాత్ర
సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ యాత్ర

సాగర్ టు శ్రీశైలం లాంచీ యాత్ర….

నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ యాత్ర ఉంటుంది. ఈ ప్యాకేజీని నవంబర్ 22వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ప్రతి శనివారం ఈ యాత్ర ఉండేలా ప్లాన్ చేశారు.ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించేలా లాంచీని సిద్ధం చేశారు.

ఈ లాంచీ ప్రయాణం కోసం పెద్దలకు రూ.2 వేలుగా నిర్ణయించారు. పిల్లలకు రూ.1,600గా ఉంది. ఇది సింగిల్ వేకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వెళ్లి రావడానికి ఒకేసారి బుక్‌ చేసుకుంటే అయితే రూ.3,250 ఛార్జీ ఉంటుంది. ఈ ప్యాకేజీ సెలెక్ట్ చేసుకుంటే…. సాగర్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి సాగర్ వరకు లాంచీలో రావొచ్చు.

హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ సీఆర్‌వో 98485 40371, 98481 25720, నాగార్జునసాగర్‌ లాంచీ యూనిట్‌ 79979 51023 నంబర్ల ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు https://tgtdc.in/home వెబ్ సైట్ ను కూడా చూడొచ్చు.

సోమశిల నుంచి కూడా యాత్ర….

సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం షురూ అయింది. ఇటీవలనే ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి.నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ తీరంలోని సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ జర్నీ ఉంటుంది. వారానికి మూడు సార్లు ఈ ఆపరేషన్ ఉంటుంది. మంగళవారం, గురువారం, శనివారాల్లో ఉదయం 9 గంటలకు లాంచీ సోమశిల నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

ఒకవైపు ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1600 వసూలు చేస్తున్నారు. లాంచీలో పర్యాటకులకు ఉదయం మరియు సాయంత్రం టీ, స్నాక్స్ మరియు లంచ్ అందిస్తారు. వన్ వే క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరలతో పోల్చితే… రౌండప్ (రానుపోను) జర్నీకి ధరలు వేరుగా ఉంటాయి. ఈ వివరాలను కూడా తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ( https://tgtdc.in/home ) లో చూడొచ్చు. లేదా స్థానికంగా ఉండే టూరిజం కార్యాలయంలో వివరాలను తెలుసుకోవచ్చు.