సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 77 ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలు
సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 77 ఖాళీలను భర్తీ చేస్తారు. వీటిలో ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్,సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలున్నాయి. నవంబర్ 22వలోపు దరఖాస్తు చేసుకోవాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 77 ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. వీటిలోప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలున్నాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 22 వరకు అప్లయ్ చేసుకోవచ్చు, https://gmcrajannasircilla.org/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను పొందుపరిచారు.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
- ఉద్యోగ నోటిఫికేషన్ - ప్రభుత్వ మెడికల్ కాలేజీ, రాజన్న సిరిసిల్ల
- ఉద్యోగ ఖాళీలు - 77
- ఖాళీల వివరాలు - సీనియర్ రెసిడెంట్ 34,అసోసియేట్ ప్రొఫెసర్ - 19,అసిస్టెంట్ ప్రొఫెసర్ - 14,ప్రొఫెసర్ - 10
- సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్బీ/ పీహెచ్డీలో ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం తప్పనిసరి. పూర్తి వివరాలను gmcrajannasircilla.org వెబ్ సైట్ లో పొందుపరిచారు.
- మొత్తం 22 విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. వీటిలో సీనియర్ రెసిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి.
- దరఖాస్తు చేసుకునే వారి వయసు… 2025 అక్టోబర్ 1వ తేదీ నాటికి 45 ఏళ్ల నుంచి 69 ఏళ్లు మించకూడదు.
- ఎంపికై వారికి నెలకు రూ. 1 లక్ష నుంచి రూ. 1,90,000 వరకు చెల్లిస్తారు. పోస్టును బట్టి జీతాన్ని నిర్ణయించారు.
- అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేయాలి. పూర్తి వివరాలతో పాటు ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి.
- దరఖాస్తు చివరి తేదీ - నవంబర్ 22, 2025 సాయంత్రం 5 గంటల వరకు
- ఎంపిక విధానం- ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు.
- ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ చిరునామా నందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- నవంబర్ 25వ తేదీన ప్రొవిజినల్ లిస్టును విడుదల చేస్తారు.
- నవంబర్ 26వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలు ఉంటాయి.
- నవంబర్ 27వ తేదీన ఎంపికైన వారి తుది జాబితాను ప్రకటిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://gmcrajannasircilla.org/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

