ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు.. ఈ తేదీలోపు అప్లై చేయండి!

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని వివిధ విభాగాల్లో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది.

Published on: Oct 23, 2025 9:59 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో వివిధ విభాగాల్లో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టుగా కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, ఫిలాసఫీ తదితర విభాగాల్లో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఓయూ ఆర్ట్స్ కాలేజీలో పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టులు
ఓయూ ఆర్ట్స్ కాలేజీలో పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టులు

అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పీహెచ్‌డీ పూర్తి చేసి కానీ, నెట్, సెట్ అర్హత కానీ ఉండాలి. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన వారి మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీని తర్వాత ప్రకటిస్తారు. రెండింటీలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తులను అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటలలోపు ప్రిన్సిపాల్ కార్యాలయంలో సమర్పించాలి. రెజ్యూమ్‌లో పేరు, చిరునామా, ముబైల్ నెంబర్ , ఇమెయిల్ ఐడీ, విద్యార్హతలు, పీహెచ్‌డీ డిగ్రీ కాపీ ఉండాలి. అన్ని పత్రాలను ధృవీకరించి దరఖాస్తుతో జతపరచాలి.

ఈ పార్ట్ టైమ్ ఉద్యోగం పూర్తిగా తాత్కాలికమైనది, ముందస్తు నోటీసు లేకుండా కూడా తొలగించే అధికారం ఉంటుంది. వేతనం విషయానికొస్తే.. ఉస్మానియ విశ్వవిద్యాలయం ఆమోదించిన రేట్ల ప్రకారం ఉంటుంది. బోధించే తరగతుల ఆధారంగా వేతనం చెల్లిస్తారు. పార్ట్ టైమ్ లెక్చరర్లు విశ్వవిద్యాలయం నుంచి ఇతర ప్రయోజనాలకు అర్హులు కాదు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలతో రెజ్యూమ్‌ను ఈ నెల 28వ తేదీలోగా ప్రిన్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.oucde.net ని సందర్శించాలి.

వాయిదా పడిన పరీక్షల తేదీ ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 18వ తేదీన బీసీ బంద్ నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. పలు కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేస్తున్నట్టుగా ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంబీఏ ఈవినింగ్, ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, కోర్సుల ముదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్‌మెంట్, డిగ్రీ కోర్సుల ముదటి, మూడో సెమిస్టర్ వన్ టైమ్ ఛాన్స్, డిస్టెన్స్ ద్వారా అందించే సర్టిఫికేట్ కోర్సు ఇన్ యోగా తదితర కోర్సుల పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను నిర్ణయించారు. విద్యార్థులు www.osmania.ac.inలో చూసుకోవచ్చు.