నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు.. 48 గంటల్లో డబ్బులు జమ!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Updated on: Nov 3, 2025, 13:27:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర తక్షణమే అందేలా, ఎటువంటి విధానపరమైన జాప్యాలు లేకుండా చూసుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు వరి ధాన్యం సేకరణను మెుదలుపెట్టింది. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని అరుగొలను గ్రామంలో ఈ సేకరణ డ్రైవ్‌ను అధికారికంగా ప్రారంభించారు.

ఏపీలో ధాన్యం కొనుగోళ్లు
ఏపీలో ధాన్యం కొనుగోళ్లు

ఈ సీజన్‌లో 51 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని రాష్ట్రం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అంతటా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాణ్యతా ప్రమాణాల ఆధారంగా పారదర్శకంగా, ఇబ్బంది లేని విధంగా రైతుల నుండి ప్రతి వరి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మనోహర్ అన్నారు. సేకరణ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సుమారు 10,700 మంది సిబ్బందిని నియమించారు.

ఫ్రెండ్లీ-ఫార్మర్ సేవలకు చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు. అమ్మకం జరిగిన 48 గంటల్లోపు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని హామీ ఇచ్చారు. గన్నీ బ్యాగులు, తేమ పరీక్ష యంత్రాలు, రవాణా సౌకర్యాలతో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

2024 ధాన్యం సేకరణలో ఎదురైన సవాళ్ల నుండి నేర్చుకోవాలని, ఈ సంవత్సరం కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సేకరణ సమయంలో అడ్డంకులను నివారించడానికి ముందస్తు ప్రణాళిక పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు. రైతులు తమ వరి అమ్మకాల ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడటానికి వాట్సాప్ నంబర్ 7337359375 కు 'హాయ్' అని సందేశం పంపాలి. ముందుగానే నమోదు చేసుకోవాలి. దీనిద్వారా అమ్మకం ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.

రైతులకు సమస్యలు ఎదురవ్వకూడదని ఈసారి క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో తహసీల్దారు, ఎంఏవో, టెక్నికల్ అసిస్టెంట్ సభ్యులుగా ఉన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఈ టీమ్ వెంటనే పరిష్కారిస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More