Pregnant woman Suicide in Medak : మానవత్వాన్ని మంటగలిపే ఘోర సంఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే, కడుపున పెరుగుతున్న బిడ్డ పుట్టుకను శంకించాడు. కన్నబిడ్డకు డీఎన్ఏ (DNA) పరీక్ష చేయించాలంటూ అత్తతో కలిసి తీవ్రమైన వేధింపులకు గురి చేశాడు. ఈ అవమానాలను తట్టుకోలేక ఓ 23 ఏళ్ల గర్భవతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన మెదక్ జిల్లాలోని అల్లాదుర్గ్ మండలంలోని గడిపెద్దపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
అనుమానంతో నిత్యం నరకం….
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వికారాబాద్ జిల్లా మోత్కుపల్లి గ్రామానికి చెందిన సుస్మిత (23) అనే యువతికి, మెదక్ జిల్లా గడిపెద్దపూర్ గ్రామానికి చెందిన గాజుల వ్యాపారి జి. అభిలాష్తో దాదాపు 18 నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం సుస్మిత ఐదు నెలల గర్భవతి. అయితే….. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే సుస్మిత ప్రవర్తనపై భర్త అభిలాష్ అనుమానం పెంచుకున్నాడు. భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. దీనికి తోడు అత్త లక్ష్మి కూడా తోడవడంతో సుస్మితకు అత్తగారింట్లో నిత్యం నరకం కనిపించింది.
శ్రీమంతం వేడుకలో గొడవ…..
కూతురు గర్భవతి కావడంతో శ్రీమంతం (బేబీ షవర్) వేడుక ఏర్పాట్ల గురించి మాట్లాడటానికి జూన్ 23న సుస్మిత తల్లి జనాబాయి, తండ్రి కలిసి గడిపెద్దపూర్లోని కూతురి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య వేడుక నిర్వహణపై తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అందరి ముందూ భర్త అభిలాష్ ఘోరానికి ఒడిగట్టాడు. సుస్మిత కడుపున పెరుగుతున్న బిడ్డ తనది కాదని….. ఆ పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయిస్తేనే శ్రీమంతం చేస్తానని అందరి సమక్షంలో తెగేసి చెప్పాడు. ఆ సమయంలో స్థానిక కుల పెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో గొడవ తాత్కాలికంగా సర్దుమణిగింది.
కానీ కట్టుకున్న భర్త అంతమంది ముందు క్యారెక్టర్ను శంకించడంతో సుస్మిత తీవ్ర అవమాన భారంతో కుంగిపోయింది. పెద్దలు పంచాయితీ పెట్టి వెళ్లినప్పటికీ…. భర్త, అత్తల వేధింపులు ఆగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత… జూన్ 25 సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.
భర్త, అత్త అరెస్ట్…
{{/usCountry}}కానీ కట్టుకున్న భర్త అంతమంది ముందు క్యారెక్టర్ను శంకించడంతో సుస్మిత తీవ్ర అవమాన భారంతో కుంగిపోయింది. పెద్దలు పంచాయితీ పెట్టి వెళ్లినప్పటికీ…. భర్త, అత్తల వేధింపులు ఆగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత… జూన్ 25 సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.
భర్త, అత్త అరెస్ట్…
{{/usCountry}}మృతురాలి తల్లి జనాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లాదుర్గ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
“బాధిత తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం. భార్యను వేధించిన భర్త జి. అభిలాష్తో పాటు అతని తల్లిని శనివారం అరెస్ట్ చేశాం. వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించాం” అని అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి. శంకర్ మీడియాకు వెల్లడించారు.