ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీ కొట్టిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులు వెళ్తున్న కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించారు.

Published on: Jan 08, 2026 6:55 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోకిల పరిధిలో మీర్జాగూడ వద్ద కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు ఐసీఎఫ్ఏఐ వర్సిటీకి చెందినవారు, మరొకరు ఎంజీఐటీ విద్యార్థిగా గుర్తించారు. మృతుల పేర్లు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్. హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

కొట్టి చంపిన కుటుంబ సభ్యులు

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో దారుణమైన ఘటన జరిగింది. ఎంప్లాయీస్ కాలనీలో నివాసం ఉండే పండ్ల వ్యాపారి విస్లావత్ రాములుకు అతడి భార్యతో పది సంవత్సరాలుగా కుటుంబ కలహాలు ఉన్నాయి. చాలాసార్లు పెద్దల ముందు పంచాయితీ జరిగింది. అయినా మార్పు లేదు. తాజాగా కూడా గొడవలు జరిగాయి. దీంతో భార్య సూర్తి, పిల్లలు సవిత, పాండు కలిసి రాములుపై దాడి చేశారు.

అందుబాటులో ఉన్న కర్రలు, రాడ్‌తో కొట్టారు. రాములుపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సవిత ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది, పాండు ఇంటర్ చదువుతున్నాడు. మరో కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. రాములు చంపిన తర్వాత నిందితులే బంధువులకు ఫోన్ చేశారు. జరిగిన విషయాన్ని చెప్పారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.