...
...
Next Story

కోఠిలోని SBI ఏటీఎం వద్ద కాల్పుల కలకలం - రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

హైదరాబాద్ కోఠిలోని SBI ఏటీఏం వద్ద కాల్పుల కలకలం రేపాయి. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Published on: Jan 31, 2026 09:08 AM IST
Advertisement

కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పులు కలకలం రేపాయి. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఇవాళ ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బులు డిపాజిట్‌ చేసేందుకు వచ్చిన రిషద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రిషద్‌ కాలికి తూటా గాయమైంది. ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఏటీఎం వద్ద కాల్పుల కలకలం
ఏటీఎం వద్ద కాల్పుల కలకలం

సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండుగులు కాల్పులు జరిపినట్లు గుర్తించినట్లు తెలిపారు.

ఈ ఘటన సుల్తాన్‌ బజార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయాన్నే ఒక్కసారిగా కాల్పుల మోత వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.బాధితుడు రిషద్‌ను నాంపల్లిలోని వస్త్ర వ్యాపారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సీసీటీవీ ఫుటేజీ …

మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది. ముందుగా రిషద్‌ ను బెదిరించి క్యాష్ తీసుకునే ప్రయత్నం జరిగినట్లు ఇందులో ఉంది. డబ్బులు ఇవ్వకపోవడంతో క్యాష్ తీసుకుని గన్‌తో కాలిపై కాల్పులు జరిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe