రియల్ ఎస్టేట్ ఆస్తులకు లక్కీ లాటరీలు నిర్వహించి ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.నరసింహ హెచ్చరించారు. అనేక మంది రియల్టర్లు, ఆస్తి యజమానులు ఇళ్ళు, ఓపెన్ ప్లాట్ల కోసం ఒక ధర పెట్టి లక్కీ డ్రాల కోసం కూపన్లను విక్రయిస్తున్నారు. ఇలాంటి లక్కీ డ్రాలతో మోసం చేసేవారికి హెచ్చరికలు జారీ చేశారు.

"1000 కట్టు, ఫ్లాట్ పట్టు" వంటి ఆకర్షణీయమైన లైన్స్ ఉపయోగించి జిల్లాలో కొంతమంది రియల్టర్లు ఈ లాటరీలను నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎస్పీ నరసింహ చెప్పారు. ఇది చట్టం ప్రకారం నేరమన్నారు. కూపన్లను విక్రయించడానికి సోషల్ మీడియాలో యూపీఐ స్కాన్ కోడ్లను కూడా షేర్ చేస్తున్నారన్నారు. దీనివల్ల ఆర్థిక మోసానికి అవకాశం ఏర్పడుతుందని ఎస్పీ చెప్పారు. పోలీసులు కొంతమంది నిర్వాహకులను గుర్తించి వారిని హెచ్చరించారని వెల్లడించారు. ఇలాంటి పథకాల బారిన పడవద్దని, మోసపూరిత లాటరీలకు డబ్బు చెల్లించవద్దని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఇటీవలి కాలంలో ఆస్తిని అమ్మడానికి చాలా మంది ఇలాంటి లక్కీ డ్రా పద్ధతి పాటిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బస్వాన్నపల్లి గ్రామానికి చెందిన రైతు రాజు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. తన 2 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని విక్రయించేందుకు లక్కీ డ్రాను ఏర్పాటు చేస్తున్నారు. రూ.10,000 చొప్పున మెుత్తం 500 టికెట్లు విక్రయించాలనుకుంటున్నారు రైతు. 500 టికెట్లు అమ్మితే రైతుకు మెుత్తం రూ.50 లక్షలు వస్తాయి. అయితే స్థానికంగా ఆ భూమి మార్కెట్ విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ డ్రా ద్వారా అదనంగా రాబట్టాలని రైతు లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొన్ని రోజుల కిందట యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఒక వ్యక్తి తన ఇంటి స్థలాన్ని లక్కీ డ్రా ద్వారా అమ్మారు. రూ.16 లక్షల విలువైన ఇంటిని లక్కీ డ్రా ద్వారా విక్రయించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పాప పేరు మీద వారి కుటుంబ లక్కీ డ్రాలో పాల్గొన్నారు. ఆ పాప లక్కీ డ్రాలో ఇంటిని గెలుచుకుంది.
{{/usCountry}}కొన్ని రోజుల కిందట యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఒక వ్యక్తి తన ఇంటి స్థలాన్ని లక్కీ డ్రా ద్వారా అమ్మారు. రూ.16 లక్షల విలువైన ఇంటిని లక్కీ డ్రా ద్వారా విక్రయించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పాప పేరు మీద వారి కుటుంబ లక్కీ డ్రాలో పాల్గొన్నారు. ఆ పాప లక్కీ డ్రాలో ఇంటిని గెలుచుకుంది.
{{/usCountry}}అయితే ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే యూపీఐ క్యూఆర్ కోడ్లకు డబ్బులు పంపకూడదని చెబుతున్నారు.