TG POLYCET 2026 : పాలిసెట్ అభ్యర్థులకు అప్డేట్ - మీకోసమే ఉచితంగా డిజిటల్ పాఠాలు, ఇలా చూడండి
TG POLYCET Digital Lessons 2026 : టీజీ పాలిసెట్ - 2026కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టీ-శాట్ అప్డేట్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి డిజిటల్ పాఠాలను ప్రారంభించనుంది.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ కు హాజరయ్యే విద్యార్థుల కోసం టీశాట్ డిజిటల్ పాఠాలను అందించనుంది. ఇవాళ్టి (ఏప్రిల్ 1) నుంచి ఈ పాఠాలు అందుబాటులోకి వస్తాయి.

శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 13వ తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 1వ తేదీ నుంచి రోజుకు రెండు గంటల చొప్పున 42 రోజుల పాటు 84 ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నట్లు టీశాట్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అనుభవం కలిగిన లెక్చరర్స్ బోధించిన పాఠ్యాంశాలు విద్య ఛానల్ ( https://www.youtube.com/@TSATNetwork ) లో ఉంటాయి. సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు, రాత్రి తొమ్మిది నుండి 11 గంటల వరకు నిపుణ ఛానల్ లో పున: ప్రసారమౌతాయని టీశాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. పదవ తరగతి లేదా తత్సమానమైన పరీక్ష పాసైన విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు హాజరై మెరుగైన ఫలితాలు సాధించేందుకు టి-సాట్ పాఠ్యాంశ ప్రసారాలను వినియోగించుకోవాలని సూచించారు.
కొనసాగుతున్న దరఖాస్తులు:
అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు పాలిసెట్ పరీక్ష కోసం అప్లికేషన్ చేసుకోవాలి. జనరల్ విద్యార్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అయితే రూ. 250గా నిర్ణయించారు. గడువు దాటితే నిర్ణయించిన ఫీజుతో పాటు రూ. 100 ఫైన్ తో ఏప్రిల్ 21వ తేదీ వరకు, రూ. 300 తాత్కల్ ఫీజుతో ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రాసెస్ కోసం https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలి.
టీజీ పాలిసెట్ - 2026 పరీక్షను మే 13వ తేదీన నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే 08031404549 ఫోన్ నెంబర్ లేదా te@telangana.gov.in, మెయిల్ ను సంప్రదింవచ్చు.
టీజీ పాలిసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ (60), ఫిజిక్స్ (30), కెమిస్ట్రీ (30) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. 10వ తరగతి (SSC) సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి మరియు నెగిటివ్ మార్కులు ఉండవు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











