తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తక్షణమే ఒక డీఏను ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కప్రకటన చేశారు. తక్షణమే ఒక DAను ఇస్తున్నట్లు తెలిపారు. రెండో డీఏను మరో 6 నెలల్లో ఇస్తామని వెల్లడించారు.
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
కేబినెట్ నిర్ణయాలివే…
మెట్రో రెండో విడత విస్తరణపై తెలంగాణ కేబినెట్లో చర్చ జరిగింది. ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించింది. లోన్ బీమా చెల్లింపుల కోసం రూ.70 కోట్లు చెల్లిస్తూ ఆమోదముద్ర వేసింది. హమ్ విధానంలో గ్రామీణ రోడ్ల ఆధునీకరణ చేపట్టాలని కేబినెట్నిర్ణయించింది.
ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు. బీమాకు ఉద్యోగులు ప్రతినెలా రూ.500చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా కొంత్త చెల్లిస్తుంది.