TG Govt Urea Booking App : ఇక 'యూరియా యాప్‌' సేవలు సులభతరం..! మార్పులపై సర్కార్ కసరత్తు

రాష్ట్రంలో యూరియా సరఫరాకు ప్రభుత్వం యాప్ బుకింగ్ ప్రాసెస్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. యాప్‌ సేవలను సులభతరం చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా పలు మార్పులు తీసుకువచ్చే సిద్ధంగా కసరత్తు చేస్తోంది.

Published on: Mar 06, 2026 1:21 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో యూరియా పంపిణీ కోసం ప్రారంభించిన యాప్‌ లో పలు మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. యాప్ సేవలను సులభతరం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవల ప్రకారం…. జిల్లాను యూనిట్‌గా తీసుకుని యూరియాను పంపిణీ చేస్తున్నారు. ఈ స్థానంలో మండలాలను యూనిట్ గా తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది.

యూరియా యాప్‌లో మార్పులు
యూరియా యాప్‌లో మార్పులు

మండలాలను యూనిట్ గా తీసుకోవటంతో ఇబ్బందులు వస్తాయని భావిస్తే… నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. త్వరలోనే ఈ మార్పులు చేసి… యూరియాను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. సాంకేతిక సమస్యలను కూడా పరిష్కరించటం ద్వారా…. యూరియా పంపిణీలో నెలకొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చని సర్కార్ భావిస్తోంది.

కొంతకాలంగా రాష్ట్రంలో యూరియా కొరత సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికితోడు ప్రైవేట్ వ్యక్తుల దందాతో లేనికొరతను సృష్టిస్తున్నారు. దీంతో రైతన్నలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం యాప్ ను తీసుకువచ్చింది.ఈ యాప్ ద్వారానే బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. Fertilizer Booking App ద్వారా ఈ సేవలను అందిస్తోంది.

యాప్ ద్వారా బుకింగ్ ప్రాసెస్ లో జిల్లా / మండలం / గ్రామాన్ని అన్నదాతలు ఎంపిక చేయాలి. అందుబాటులో ఉన్న యూరియా స్టాక్ వివరాలు వస్తాయి. సమీప డీలర్ షాప్‌ల జాబితా కనిపిస్తుంది. తర్వాత అవసరమైన యూరియా బ్యాగుల సంఖ్య ఎంపిక చేయాలి. బుకింగ్ పూర్తయ్యాక బుకింగ్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ సాధారణంగా 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతానికి యూరియా యాప్‌లో జిల్లా యూనిట్‌గా పంపిణీ జరుగుతోంది. దీంతో జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రద్దీ ఏర్పడుతోంది. ముందు వచ్చిన వారికే యూరియా దొరుకుతోంది. దీంతో చాలా మరికొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.

వీటన్నింటినీ పరిశీలించిన వ్యవసాయ శాఖ….. జిల్లా యూనిట్ల స్థానంలో ఇకపై రైతులకు అందుబాటులో ఉండే మండల కేంద్రాలు ఒకటి లేదా రెండింటిని కలిపి ఒక యూనిట్‌గా చేయాలని భావిస్తోంది. సహకార సంఘాలు, ఎరువుల దుకాణాలు తక్కువగా ఉంటే నియోజకవర్గం యూనిట్‌గా పంపిణీ చేయాలని కసరత్తు చేస్తోంది. త్వరలోనే యాప్ లో మార్పులు చేసి… ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది.

ప్రస్తుతం ఎలా లాగిన్ అవ్వాలి?

  • మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
  • ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేయాలి.
  • పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ నమోదు చేయాలి.
  • భూమి వివరాలు ఆటోమేటిక్‌గా యాప్‌లో చూపిస్తాయి.
  • నమోదు చేయాల్సిన వివరాలు
  • పంట, భూమి ఆధారంగా మీకు అర్హమైన యూరియా బ్యాగుల సంఖ్య యాప్‌లో చూపిస్తుంది.అవసరమైన బ్యాగుల సంఖ్య ఎంటర్ చేసి మీ జిల్లాలోని డీలర్ షాప్‌ను ఎంపిక చేసి బుకింగ్ కన్ఫర్మ్ చేయాలి.
  • పంట రకం, పంట సీజన్ (ఖరీఫ్ / రబీ), భూమి పరిమాణం (ఎకరాల్లో), పాస్‌బుక్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి.
  • పంట రకం, భూమి విస్తీర్ణం ఆధారంగానే యూరియా కేటాయింపు జరుగుతుందని గుర్తుంచుకోవాలి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More