కల్వకుంట్ల కవిత అరెస్ట్.. నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలింపు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. నాంపల్లి పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఆనెను నాంపల్లి పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు. సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించడం, మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్తో నాంపల్లిలోని సింగరేణి భవన్ను కవితతోపాటుగా ఆ సంస్థ నేతలు ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు కల్వకుంట్ల కవిత అక్కడకు ఆటోలో వచ్చారు. నాంపల్లిలోని సంగరేణి భవన్ను కవిత, జాగృతి నేతలు, హెచ్ఎంఎస్ నాయకులు ముట్టడించే ప్రయత్నం చేయగా దీంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువైపులా తోపులాట జరిగింది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. దీంతో కవితతోపాటుగా మరికొందరి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని కవిత డిమాండ్ చేశారు. కొత్త బ్లాకులను సింగరేణికి మాత్రమే కేటాయించాలని చెప్పారు. 'సింగరేణి పరిధిలో ప్రతీ కాంట్రాక్ట్లో 25 శాతం అవినీతి జరుగుతోంది. అందులో 10 శాతం వాటా కాంగ్రెస్ నాయకులు వెళ్తోంది. అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం స్పందించకపోతే సీబీఐకి ఫిర్యాదు చేస్తాం. సింగరేణి కార్మికుల జీతాల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లు నిలిపివేయలి. దీనితో కార్మికులపై ఆర్థిక భారం తగ్గుతుంది.' అని కవిత అన్నారు.
మెడికల్ బోర్డు కార్మికుల ఆరోగ్యానికి అత్యవసరం అని కవిత అన్నారు. రెండేళ్లుగా తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు తీసివేయడం సరికాదన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయకపోతే.. పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా జనం బాట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సత్తపల్లిలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనులను సందర్శించారు. ఈ సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉందని చెప్పారు. సింగరేణిలోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, వేజ్ బోర్డు ప్రకారం వేతను అందజేయాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల, కార్మికుల పిల్లలకు పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


