తెలంగాణలో మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు షెడ్యూల్ ఖరారైంది. 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి కూడా ఎగ్జామ్ ఉంటుంది.
ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 28 నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 28వ తేదీతో గడువు ముగుస్తుంది. ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థి.. నాల్గో తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇందుకు సంబంధించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు.
- అర్హులైన విద్యార్థులు https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- హోం పేజీలోని ఆన్ లైన్ పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ సీ విద్యార్థులు రూ. 125, ఓసీ విద్యార్థులు రూ. 200 ఫీజు చెల్లించాలి.
- ఆరో తరగతి ప్రవేశాలకు 100 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. తెలుగు, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలుంటాయి.
- ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
- ఏప్రిల్ 19వ తేదీన విద్యార్థులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది.
- ఇందుకు సంబంధించిన ఫలితాలను https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా వెల్లడిస్తారు.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}