...
...
Next Story

TG POLYCET Counseling 2026 : తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే..?

TG POLYCET 2026 Counselling Schedule : రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మే 27 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా, జూన్ 9 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Published on: May 20, 2026, 13:29:49 IST
Advertisement

TG POLYCET 2026 Counselling Schedule : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2026-27) డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27వ తేదీ నుంచి పాలిసెట్ (POLYCET) కౌన్సెలింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది.

టీజీ పాలిసెట్ ఫలితాలు ఎప్పుడంటే..?

తెలంగాణ పాలిసెట్ 2026
తెలంగాణ పాలిసెట్ 2026

ఈ ఏడాది మే 13వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే… ఈ నెల 23వ తేదీ లోపు పరీక్ష ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాల విడుదలకు ముందే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జారీ చేయడం ఈసారి విశేషం. దీనివల్ల విద్యార్థులకు ముందస్తు ప్రణాళిక వేసుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది. ఇక టీజీ పాలిసెట్ ఫలితాలు విడుదలైన తర్వాత https://www.polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టీజీ పాలిసెట్ 2026 - తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ :

టీజీ పాలిసెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మే 27 నుంచి జూన్ మొదటి వారం వరకు సాగనుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి.

  • మే 27 నుంచి 31 వరకు : అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ప్రాసెస్ ఫీజు చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
  • మే 29 నుంచి జూన్ 1 వరకు : హెల్ప్‌లైన్ కేంద్రాలలో అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన (ధ్రువపత్రాల పరిశీలన) జరుగుతుంది.
  • మే 29 నుంచి జూన్ 3 వరకు : సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
  • జూన్ 6న : అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా మొదటి విడత సీట్ల కేటాయింపు చేపడతారు.
  • జూన్ 6 నుంచి 9 వరకు : సీటు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
  • జూన్ 8 మరియు 9 తేదీల్లో : విద్యార్థులు తమకు సీటు వచ్చిన పాలిటెక్నిక్ కళాశాలల్లో నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలి.
  • జూన్ 9న : పాలిటెక్నిక్ కొత్త విద్యా సంవత్సరం (తరగతులు) ప్రారంభమవుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe