తెలంగాణకు చెందిన 19 ఏళ్ల విద్యార్థి హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లో సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అంగద్ శివ అనే విద్యార్థి హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరి గ్రామానికి చెందిన శివ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) లో డిగ్రీ చదువుతున్నాడు. ప్రస్తుతం క్యాంపస్ లోని హాస్టల్ గదిలో ఉంటున్నాడు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన జరిగిన సమయంలో శివ ఒక్కడు మాత్రమే గదిలో ఉన్నాడు. అతని ఇద్దరూ రూమ్ మెంట్స్ హర్యాణనకు చెందినవారు కాగా… మధ్యాహ్న భోజనానికి వెళ్లారు. ఉదయం 10 గంటల సమయంలో శివ తరగతులకు హాజరయ్యాడు. ఆ తర్వాత తరగతి గది నుంచి నేరు హాస్టల్ కు వెళ్లాడు.
శివ మధ్యాహ్న భోజనం కోసం మెస్ కి రాకపోవడంతో… అతని రూమ్ మేట్స్ లో ఒకరు అతన్ని పిలవడానికి తిరిగి వెళ్లారు. గది లోపలి నుంచి లాక్ చేయబడింది. పదే పదే తలుపులు తట్టినా స్పందన లేదు. ఆ తర్వాత భవనం వెనుక వైపునకు వెళ్లి కిటికీ గుండా చూశాడు. శివ సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ ఉండటాన్ని చూశాడు.
ఈ విషయాన్ని వెంటనే ఎన్ఐటీ అడ్మినిస్ట్రేషన్ కు నివేదించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రి (ఎల్ఎన్జేపీ)కి తరలించారు. ఆపై శివ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక విచారణలో శివ తరచూ ఫోన్ లో మాట్లాడేవాడినని… కానీ తమకు అతని మాతృభాష అర్థం కాలేదని అతని స్నేహితులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకోగా… దర్యాప్తు చేస్తున్నారు.