మద్దతు ధరతోపాటుగా బోనస్ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధం.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్
ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ వానాకాలంలో రికార్డ్ స్థాయిలో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని వెల్లడించారు.
సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు.. ఖరీఫ్ ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో మాట్లాడారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణలో రికార్డు సృష్టించిదని, రికార్డు స్థాయిలో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ధాన్యం అధిక దిగుబడి, అధిక కొనుగోళ్ల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
'ధాన్యం కొనుగోలులో గత అనుభవాలు దృష్టిలో పెట్టుకోవాలి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలి. కొనుగోలు చేసిన తర్వాత ధాన్యాన్ని తరలించడానికి ఏర్పాటు చేసిన రవాణా వసతిపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. రైతులకు ఎక్కడ కూడా నిరీక్షించకుండా చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాల కల్పన అంశంలో అత్యవసరం అనుకుంటే అదనపు ఖర్చుకు వెనకాడొద్దు.' అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
ధాన్యం కొనుగోలు వివరాలను వెంటనే నమోదు చేయాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. నమోదైన కొనుగోళ్లకు 48 గంటలలో చెల్లింపులు జరగాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. కలెక్టర్స్ అందరూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. మద్దతు ధరతోపాటుగా బోనస్ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
'తెలంగాణ రికార్డు స్థాయిలో 148.03 LMT వరి దిగుబడిని నమోదు చేసింది. దేశంలోనే అత్యధికం. ఈ ఖరీఫ్లో సేకరణలో కొత్త రికార్డు. అధిక దిగుబడి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రైతులకు ప్రాథమిక సౌకర్యాలు, త్వరిత చెల్లింపులు ఉండేలా చూసుకోండి. రవాణా, మిల్లర్ సమన్వయంపై దృష్టి పెట్టండి. MSPకి అదనంగా బోనస్ చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వేగవంతమైన సేకరణలో తెలంగాణ ముందుంది. మాది రైతు అనుకూల ప్రభుత్వం' అని మంత్రి ఉత్తమ్ అన్నారు.
కలెక్టర్లు, అధికారులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఎప్పుడైనా తనను, పౌర సరఫరాల కమిషనర్ను సంప్రదించొచ్చని తెలిపారు. 24×7 అందుబాటులో ఉంటామని చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


