రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అర్హులైన విద్యార్థులు… వచ్చే జనవరి 21లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద ఐదో తరగతిలో ప్రవేశాలు ((TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) కల్పిస్తారు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసేందుకు అర్హులవుతారు.
ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే..?
ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు గురుకుల సొసైటీలలో ఈ ఎంట్రెన్స్ ద్వారానే అడ్మిషన్లను పూర్తి చేస్చారు. ప్రవేశ పరీక్షను వచ్చే ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది.
అన్ని జిల్లాల్లోని నిర్ణీత పరీక్షా కేంద్రాల్లో కొనసాగే ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫీజు రూ.100గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఆయా గురుకుల విద్యాలయ సంస్థల అధికారిక వెబ్సైట్( https://tgcet.cgg.gov.in )ను సందర్శించవచ్చు.
దరఖాస్తు విధానం….
- ముందుగా https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి.
- హోం పేజీలోని పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పేమెంట్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పూర్తి వివరాలను నమోదు చేయటంతో పాటు ఫొటోను అప్ లోడ్ చేయాలి.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.