ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ II ఫలితాలు విడుదల.. ఇక్కడ నుంచి సెలక్షన్ లిస్టు చూసుకోండి
తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ II పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. తాజాగా విడుదలైన ఫైనల్ లిస్టును మీరు ఇక్కడ చూడవచ్చు.
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - II పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సెలక్షన్ లిస్టును విడుదల చేసింది. ఈ పోస్టులకు 24,045 మంది దరఖాస్తు చేసుకున్నారు. 23,323 పరీక్ష రాశారు. అంతకుముందు మెరిట్ లిస్ట్ ప్రకటించగా.. తాజాగా సెలక్ట్ అయిన 1260 మంది ఫైనల్ సెలక్షన్ లిస్టును విడుదల చేశారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ జాబితాను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సచివాలయంలోని ఆయన కార్యాలయంలో తాజాగా విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ అధికారిక వెబ్సైట్లో ఉంది.
స్పోర్ట్స్ కోటా సెలక్షన్ లిస్ట్ త్వరలో విడుదల కానుంది. ఇందులో 18 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన వారి పేర్లను ప్రత్యేకంగా విడుదల చేస్తారు. మరోవైపు వికలాంగుల కోటాలో 2 పోస్టులు దరఖాస్తుదారులు లేరు. దీంతో ఆ 2 పోస్టులు ఖాళీగా మిగిలినట్టుగా బోర్డు పేర్కొంది. దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన కేసు హైకోర్టులో కొనసాగుతుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి.. తాజాగా బోర్డు 1260 మందితో ఫైనల్ లిస్టులను ప్రకటించింది. బోధనాస్పత్రులు, జిల్లా/ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తి చేస్తున్నారు.
ఈ లింక్ క్లిక్ చేసి ఎంపికైనవారి పేర్లు చూడవచ్చు
కిందడి ఏడాది సెప్టెంబర్ 11న ప్రభుత్వం గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగింది. పరీక్ష ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను ప్రకటనకు బోర్డు పలు దశల్లో పరిశీలన చేసింది. ఇందులో కొందరు ఒప్పంద ఉద్యోగులు కూడా ఉన్నారు. వారి పని అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లను జాగ్రత్తగా పరిశీలించారు. ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించారని గుర్తించడంతో జిల్లాల డీఎంహెచ్ఓలకు దర్యాప్తు కోసం పంపారు.
ఆ తర్వాత ఆగస్టు 7న మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసింది. తాజాగా ఫైనల్ సెలక్షన్ లిస్టును విడుదల చేసింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


