...
...
Next Story

TG POLYCET 2026 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - టీజీ పాలిసెట్ దరఖాస్తులు ప్రారంభం, ముఖ్యమైన వివరాలు

టీజీ పాలిసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవచ్చు. మే 13వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది.

Published on: Feb 04, 2026 06:03 AM IST
Advertisement

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ -2026 ఎంట్రెన్స్ పరీక్షపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే షెడ్యూల్ విడుదలకాగా.. తాజాగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. టెన్త్ పాస్ అయిన వారితో పాటు ప్రస్తుతం పరీక్షలు రాసే విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాసేందుకు అర్హులవుతారు.

తెలంగాణ పాలిసెట్ - 2026
తెలంగాణ పాలిసెట్ - 2026

రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యాకోర్సులకు గతేడాది ప్రభుత్వం జారీచేసిన నిబంధనల మాదిరిగానే పాలిటెక్నిక్‌ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నారు.

ముఖ్యమైన తేదీలు…

అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి. జనరల్ విద్యార్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అయితే రూ. 250గా నిర్ణయించారు. గడువు దాటితే నిర్ణయించిన ఫీజుతో పాటు రూ. 100 ఫైన్ తో ఏప్రిల్ 21వ తేదీ వరకు, రూ. 300 తాత్కల్ ఫీజుతో ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రాసెస్ కోసం https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలి.

టీజీ పాలిసెట్ - 2026 పరీక్షను మే 13వ తేదీన నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే 08031404549 ఫోన్ నెంబర్ లేదా te@telangana.gov.in, మెయిల్ ను సంప్రదింవచ్చు.

4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు ఇక్కడ చదివితే లోకల్‌గా పరిగణిస్తారు. నాన్‌లోకల్‌ కోటా కింద.. పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వారి పిల్లలకు ఇతర రాష్ట్రాలకు చెందిన, తెలంగాణలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తారు.

టీజీ పాలిసెట్ పరీక్ష నిర్వహణ తర్వాత ప్రాథమిక కీని విడుదల చేస్తారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో వచ్చే ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించి….సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే… స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేస్తారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ పాలిసెట్ - 2026 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe