TG SET 2026 Applications : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ అప్డేట్ - దరఖాస్తుల గడువు పొడిగింపు
Telangana SET Online Application : తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET 2026) ఆన్లైన్ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. అభ్యర్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 5 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
Telangana SET Online Applications 2026 : విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా అర్హత సాధించేందుకు నిర్వహించే 'తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్' ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు, నిరుద్యోగులకు ఊరటనిస్తూ దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని నిర్వహణ అధికారులు స్పష్టం చేశారు.

అభ్యర్థులు టీజీ సెట్ అధికారిక వెబ్సైట్లు https://tgset.aptonline.in/ లేదా https://telanganaset.org/ సందర్శించి వెంటనే తమ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థుల హాల్ టికెట్లను అందుబాటులోకి తెస్తారు.
సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ చివరి వారంలో ఈ అర్హత పరీక్షలను నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
టీజీ సెట్ - పరీక్షా విధానం :
- టీజీ సెట్-2026 పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి:
- పేపర్-1 : సాధారణ జ్ఞానం, బోధనా, పరిశోధనా నైపుణ్యాలను పరిశీలించేలా 50 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 మార్కులు కేటాయించారు.
- పేపర్-2 : అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు కేటాయించారు.
- రెండు పేపర్లు కలిపి మొత్తం 300 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్ష రాయడానికి అభ్యర్థులకు మొత్తం 3 గంటల వ్యవధి ఇస్తారు. అర్హత గల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

