తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఫలితాలను(జనరల్ ర్యాంకింగ్ ) ప్రకటించగా… తాజాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను ప్రకటించింది. నవంబర్ 10వ తేదీ నుంచి ఈనెల 26 వరకు పరిశిలీన ఉంటుందని పేర్కొంది.

ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు నాంపల్లి పబ్లిక్గార్డెన్లోని సురవరం ప్రతాప్రెడ్డి యూనివర్సిటీలో(గతంలో పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ) ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం వివరాలను వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్ నెంబర్లను పేర్కొన్నారు.
టీజీపీఎస్సీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు రెండు సెట్లు స్వయంగా సంతకం చేసిన ఫొటో కాపీలు తీసుకురావాల్సి ఉంటుంది.
అభ్యర్థి ఉండాల్సిన పత్రాలు...
- అప్లికేషన్ ఫామ్
- హాల్ టికెట్ పత్రం
- ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా పాస్ పోర్ట్/ డ్రైవింగ్ లైసెన్స్/ సర్వీస్ ఐడీ కార్డ్స్, పాన్ కార్డు
- విద్యా అర్హత పత్రాలు
- పదో తరగతి మెమో
- ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- రెసిడెన్సీ సర్టిఫికెట్లు
- స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే ధ్రువీకరణ పత్రాలు
- కుల ధ్రువీకరణ పత్రం
- ఈడబ్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాలి.
- దివ్యాంగ అభ్యర్థులు - సంబంధిత సర్టిఫికెట్లు
- ఇతర ధ్రువపత్రాలు
రాష్ట్రంలో 1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు 50.24శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ ప్రక్రియంతా పూర్తి కావటంతో… ఈ ఏడాదిలో మార్చిలో ఫలితాలను(జనరల్ ర్యాంకింగ్ లిస్ట్) ప్రకటించారు. అంతేకాకుండా ఫైనల్ కీలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
గ్రూప్ 3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహించారు. ప్రతి పేపర్లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత… నియామకపత్రాలను అందజేస్తారు.
{{/usCountry}}గ్రూప్ 3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహించారు. ప్రతి పేపర్లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత… నియామకపత్రాలను అందజేస్తారు.
{{/usCountry}}