TGPSC Recruitment 2026 : టీజీపీఎస్సీ నుంచి శుభవార్త - మరో నోటిఫికేషన్ విడుదల, ఈనెల 7 నుంచి దరఖాస్తులు
TGPSC Seed Certification Office Recruitment 2026 : సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జూలై 7 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
TGPSC Seed Certification Office Recruitment 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త అందించింది. తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ఖాళీగా ఉన్న 'సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్' పోస్టుల భర్తీకి కమిషన్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. జనరల్ రిక్రూట్మెంట్ కింద రాష్ట్ర స్థాయి కేడర్లో మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.

అర్హతలు….
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు నిర్ణీత విద్యా అర్హతలు కలిగి ఉండాలి. ఐసీఏఆర్ (ICAR) గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బేసిక్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ తో పాటు, సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీ విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎం.ఎస్సీ (M.Sc. Ag.) పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి విషయానికి వస్తే…. జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 వరకు స్కేల్ ఆఫ్ పే (జీతం) లభిస్తుంది.
ఈనెల 7 నుంచి దరఖాస్తులు…
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూలై 7, 2026 నుంచి ఆగస్టు 12, 2026 వరకు కమిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులను సమర్పించవచ్చు. విద్యార్హతలు, సిలబస్, ఎంపిక విధానం మరియు ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్ను ( https://www.tgpsc.gov.in/ ) సందర్శించాలని కమిషన్ సెక్రటరీ సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

