తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 22వ తేదీ నుంచి సమ్మె నడుస్తోంది. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు చాలా చోట్ల నిరసనలు చేపట్టారు. అయితే నిరసనలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ.. నర్సంపేట బస్టాండ్ ఎదుట శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయనను వరంగల్లోని ఆసుపత్రికి తరలించారు.
శంకర్ గౌడ్కు తీవ్రమైన కాలిన గాయాలవ్వడంతో వరంగల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వంలో విలీనాన్ని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. పలు డిపోల వద్ద ప్రదర్శనలు చేశారు.
సికింద్రాబాద్లో మహాధర్నా
ఆర్టీసీని ప్రయివేట్ పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సికింద్రాబాద్లోని రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన మహాధర్నాకు ఆయన హాజరై సమ్మెకు మద్దతు తెలిపారు. 92 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు.
సురక్షిత ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్టీసీ వేలాదిమంది ఉద్యోగుల శ్రమ, కృషి ఎంతో ఉందన్నారు తలసాని. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని, వాటిని పరిష్కరించి సమ్మెను విరమింప చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను డ్రైవర్లుగా పెట్టి ఎలక్ట్రిక్ బస్సులను ఎలా నడుపుతారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. 'తెలంగాణ ప్రాంత ఉద్యోగుల ఉపాధిని దెబ్బతీయడానికా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది? నగరంలోని రాణిగంజ్, గౌలిగూడ తదితర 5 ఆర్టీసీ డిపోలను ఎలక్ట్రికల్ బస్సులకు చెందిన ప్రయివేట్ సంస్థలకు అప్పగించారు. ఎవడబ్బ సొమ్మని ప్రయివేట్ సంస్థలకు ఆర్టీసీ ఆస్తులను ధారాదత్తం చేస్తారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానించి గవర్నర్కు పంపించడం జరిగింది. ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయాలి.' అని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
{{/usCountry}}ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను డ్రైవర్లుగా పెట్టి ఎలక్ట్రిక్ బస్సులను ఎలా నడుపుతారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. 'తెలంగాణ ప్రాంత ఉద్యోగుల ఉపాధిని దెబ్బతీయడానికా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది? నగరంలోని రాణిగంజ్, గౌలిగూడ తదితర 5 ఆర్టీసీ డిపోలను ఎలక్ట్రికల్ బస్సులకు చెందిన ప్రయివేట్ సంస్థలకు అప్పగించారు. ఎవడబ్బ సొమ్మని ప్రయివేట్ సంస్థలకు ఆర్టీసీ ఆస్తులను ధారాదత్తం చేస్తారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానించి గవర్నర్కు పంపించడం జరిగింది. ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయాలి.' అని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
{{/usCountry}}పెండింగ్లో ఉన్న రెండు పీఆర్సీలను వెంటనే అమలు చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రిటైర్ ఉద్యోగుల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల 32 డిమాండ్లలో 29 ఆమోదించామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని, ఆమోదించిన 29 డిమాండ్లు ఏంటో మీడియా ముఖంగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.