నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా… మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న సిమెంట్ ట్యాంకర్ ను డీసీఎం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

{{^htLoading}} {{/htLoading}}
ప్రాథమిక వివరాల ప్రకారం…. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు గ్రానెట్ టైల్స్ లోడ్ తో డీసీఎం వాహనం వెళ్తోంది. ఈదులగూడ బైపాస్ దగ్గర మలుపు తిరుగుతున్న సమయంలో ట్యాంకర్ ను డీసీఎం వాహనం ఢీకొట్టింది.డీసీఎంలోని టైల్స్ మీద పడి ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా… పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}