...
...
Next Story

హైదరాబాద్ లో విషాదం - ట్రైన్ కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

హైదరాబాద్ లో విషాద ఘటన వెలుగు చూసింది. రైలు కిందపడి ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చర్లపల్లి- ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది.

Published on: Jan 31, 2026 12:43 PM IST
Advertisement

హైదరాబాద్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోడుప్పల్ హరితహారం కాలనీలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి తల్లితో పాటు ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ మధ్య రైలు కిందపడి చనిపోయారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Representative Image )
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Representative Image )

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. విజయ(35), విశాల్‌(17), చేతన(18)ను మృతులుగా గుర్తించారు. మృతుల వద్ద ఎలాంటి ప్రయాణ టికెట్లు లభించలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe