TS Inter Marks Memo : ఇంటర్ మార్కుల మెమోలో తప్పులుంటే ఎలా? రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ వివరాలు

TS Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు తమ మార్కుల మెమోలు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఒకవేళ వాటిలో తప్పులు ఉంటే ఏం చేయాలి? రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ గురించి కూడా తెలుసుకోండి.

Published on: Apr 12, 2026 11:38 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. 2026 ఇంటర్ సెకండియర్ జనరల్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జయశంకర్ భూపాలపల్లి (82.34%), కొమురం భీమ్ ఆసిఫాబాద్ (82.16 శాతం) నిలిచాయి. ములుగు జిల్లా 82.12 శాతంతో నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

అట్టడుగున ఉన్న జిల్లాలను గమనిస్తే

  • రాజన్న సిరిసిల్ల: 58.69 శాతం
  • వరంగల్: 60.80 శాతం
  • ఆదిలాబాద్: 62.50 శాతం

2026 ఫలితాల్లో జనరల్ స్ట్రీమ్ సెకండియర్‌లో మొత్తం 4,11,474 మంది విద్యార్థులు హాజరుకాగా, 3,11,112 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత శాతం 81.78 కాగా, బాలురు 68.99 శాతంతో సరిపెట్టుకున్నారు. దాదాపు 12 శాతం వ్యత్యాసంతో బాలికలు ముందంజలో ఉన్నారు. ఇక ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే 4,41,864 మందికి గాను 2,95,780 మంది (66.94 శాతం) గట్టెక్కారు.

రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ వివరాలు

తమ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థుల కోసం బోర్డు రెండు రకాల అవకాశాలను కల్పించింది. దీని కోసం ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 20 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు.

రీ-కౌంటింగ్: ఒక్కో పేపరుకు రూ.100 చెల్లించాలి. ఇందులో కేవలం మార్కుల లెక్కింపును మాత్రమే మరోసారి సరిచూస్తారు.

రీ-వెరిఫికేషన్ : ఒక్కో పేపరుకు రూ.800 చెల్లించాలి. ఇందులో విద్యార్థికి తన సమాధాన పత్రం స్కాన్డ్ కాపీని అందజేస్తారు, అలాగే మార్కుల లెక్కింపును కూడా తనిఖీ చేస్తారు.

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో తప్పిన విద్యార్థుల కోసం మే 13, 2026 నుండి మే 22, 2026 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి రెండు సెషన్లలో జరుగుతాయి. దీనికి సంబంధించిన పరీక్ష ఫీజును కూడా ఏప్రిల్ 13 నుండి 20 మధ్యలో తమ కాలేజీల్లో చెల్లించాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ పరీక్షలు కూడా మే 22 తర్వాత రెండు సెషన్లలో నిర్వహించబడతాయి.

మార్కుల మెమోలో తప్పులుంటే?

ఆన్‌లైన్ మెమోలో పేరు, గ్రూపు లేదా మార్కులలో ఏవైనా పొరపాట్లు ఉంటే, ఫలితాలు విడుదలైన 10 రోజులలోపు ప్రిన్సిపాల్ ద్వారా లేదా బోర్డు హెల్ప్‌డెస్క్‌కు (helpdesk-ie@telangana.gov.in) ఫిర్యాదు చేయాలి. ఆ గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను బోర్డు స్వీకరించదు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More