రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువుపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకోని విద్యార్థుల కోసం…. మార్చి 31వ తేదీ వరకు తాజాగా గడువు పొడిగించారు.

{{^htLoading}} {{/htLoading}}
రాష్ట్రంలో 2025- 2026 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గతేడాది జూలై నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించారు. కొత్తవాటివి మాత్రమే కాకుండా… రెెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించారు.
చాలా మంది విద్యార్థులు ఇంకా దరఖాస్తు చేసుకోకపోవటంతో…. గడువు పొడిగించారు. ప్రవేశ పరీక్షల డేటాను ఈపాస్ వెబ్సైట్లో నమోదు చేయకపోవడంతో పలువురు విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా గడువును పొడిగించారు.
ఈ-పాస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా….
- అర్హత కలిగిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
- రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు.
- కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ను నోట్ చేసుకోవాలి.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}