జగిత్యాల జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై భౌతిక దాడికి పాల్పడటమే కాకుండా, వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్లతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని న్యాయస్థానంలో హాజరుపరిచి జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
ఇంట్లోకి వెళ్లి దాడి…ఆపై వీడియో రికార్డ్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆగస్టు 3న సదరు మహిళ మరొక వ్యక్తితో కలిసి మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు హఠాత్తుగా ఆ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వారిపై దాడికి ప్రయత్నించారు. ప్రధాన నిందితులైన శివరాత్రి నాగేష్, శ్రీకాంత్ కలిసి ఆ మహిళ, ఆమెతో ఉన్న వ్యక్తి దృశ్యాలను తమ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు. అనంతరం ఆ వ్యక్తిని బెదిరించి అక్కడి నుంచి పంపించివేశారు.
ఆ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై నగేష్, శ్రీకాంత్ తీవ్రస్థాయిలో భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో మిగతా ఇద్దరు నిందితులు అంజయ్య, మల్లేష్ ఇంటి బయట కాపలాగా నిలబడి ఎవరూ రాకుండా చూశారు.
ఈ దారుణం అక్కడితో ఆగలేదు. దాడి జరిగిన అనంతరం నిందితులు సదరు మహిళ ఫోన్ నంబర్కు రికార్డ్ చేసిన వీడియోలను పంపిస్తూ తీవ్రంగా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. డబ్బులు ఇవ్వాలని, లేకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. నిందితుల వేధింపులు తాళలేక బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి మల్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నిందితులు అరెస్ట్ - వెలుగులోకి నేర చరిత్ర
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన శివరాత్రి నగేష్, శ్రీకాంత్లకు గతంలోనే నేర చరిత్ర ఉందని, వారిపై పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచి ఉందని పోలీసులు తెలిపారు. నగేష్పై ఇప్పటికే 13 క్రిమినల్ కేసులు నమోదు కాగా…. శ్రీకాంత్పై కూడా పలు తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.
{{/usCountry}}బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన శివరాత్రి నగేష్, శ్రీకాంత్లకు గతంలోనే నేర చరిత్ర ఉందని, వారిపై పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచి ఉందని పోలీసులు తెలిపారు. నగేష్పై ఇప్పటికే 13 క్రిమినల్ కేసులు నమోదు కాగా…. శ్రీకాంత్పై కూడా పలు తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.
{{/usCountry}}ఈ కేసులో బాధిత మహిళపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్న పోలీసులు… పకడ్బందీగా విచారణ జరుపుతున్నారు.